Liquor Shops: మద్యం దుకాణాలు నా నియంత్రణలో లేవు!
జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాలు తొలగింపు అంశం నా నియంత్రణలో లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాలు తొలగింపు అంశం తన నియంత్రణలో లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మద్యం దుకాణాల తొలగింపు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించదని.. అది కేవలం రాష్ట్రాలకు చెందిన అంశమని రాజ్యసభలో వెల్లడించారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా శాఖ జోక్యం చేసుకుంటుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం, తొలగింపులపై ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండేలా స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాలకు సూచించారు. అంతేకాకుండా మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 185 ప్రకారం, తాగి వాహనం నడిపితే జరిమానా, శిక్ష ఉంటాయని గుర్తు చేశారు.
4.49లక్షల ప్రమాదాలు.. 1.51లక్షల మరణాలు
దేశవ్యాప్తంగా 2019 సంవత్సరంలో మొత్తం 4లక్షల 49వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ ప్రమాదాల్లో మొత్తం 1,51,113 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. అంతకుముందు ఏడాది (2018)తో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గాయని చెప్పారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్రూట్లో వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వాడడం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.