Third Wave: భారత్లో.. థర్డ్వేవ్ మొదలైనట్లే..!
గత వారం రోజులుగా కొవిడ్ కోసుల్లో భారీ పెరుగుదలను చూస్తుంటే దేశంలో మహమ్మారి మూడోవేవ్ను సూచిస్తోందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోఢా పేర్కొన్నారు.
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోఢా
దిల్లీ: గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో బయటపడుతోన్న పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే వాటిలో ఎక్కువగా కొత్తవేరియంట్ ఒమిక్రాన్వే ఉంటున్నాయి. ఇలా గత వారం రోజులుగా కొవిడ్ కోసుల్లో భారీ పెరుగుదలను చూస్తుంటే దేశంలో మహమ్మారి మూడోవేవ్ను సూచిస్తోందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోఢా పేర్కొన్నారు. అనేక దేశాల్లో ఇదే తరహాలో విజృంభణ మొదలైందన్న ఆయన.. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించిన విషయాన్ని గుర్తుచేశారు.
‘దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్వేవ్కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందింది’ అని డాక్టర్ అరోఢా స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికా మాదిరిగానే..
దక్షిణాఫ్రికాలో విస్తృత వేగంతో వ్యాపిస్తూ విజృంభించిన ఒమిక్రాన్ వేవ్ను పరిశీలిస్తే.. రెండు వారాల తర్వాత కేసుల్లో తగ్గుదల కనిపించింది. అందులోనూ ఎక్కువగా లక్షణాలు లేని, స్వల్ప అనారోగ్యం, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా తక్కువగానే కనిపించింది. ఈ అంశాలన్నీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతి త్వరలోనే తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నాయి. సాంక్రమిక వ్యాధుల విషయంలో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య కాస్త సారూప్యతలు ఉన్నాయి. ఇరు దేశాల్లోనూ సహజ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్ విషయంలో మాత్రం భారత్లో భారీ స్థాయిలో పంపిణీ జరిగింది’ అని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోఢా గుర్తుచేశారు.
త్వరలోనే గరిష్ఠానికి..
దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోఢా అంచనా వేశారు. భారత్లో గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే థర్డ్వేవ్ గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయినప్పటికీ భయపడాల్సి అవసరం లేదని ఉద్ఘాటించిన ఆయన.. వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే పూర్తి మోతాదులో (రెండో డోసు) వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటితోపాటు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటికే 23రాష్ట్రాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పటివరకు 1892 మందిలో బయటపడింది. మహారాష్ట్రలో అత్యధికంగా 568 రికార్డుకాగా, దిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కేసులు నమోదుకాగా దేశంలో కొవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం