US: అమెరికాలో మారిన ఐసొలేషన్, క్వారంటైన్ లెక్కలు.. కారణమిదే!
ఐసొలేషన్, క్వారంటైన్ నిబంధనల్లో అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) కీలక మార్పులు చేసింది. వీటి గడువును తగ్గించింది......
వాషింగ్టన్: దేశంలో కొవిడ్ ఇతర వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఐసొలేషన్, క్వారంటైన్ నిబంధనల్లో అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం (సీడీసీ) కీలక మార్పులు చేసింది. వీటి గడువును తగ్గించింది. కొవిడ్ నిర్ధరణకు ముందు రెండు రోజులు, తర్వాత మూడు రోజుల్లోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉంటోందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నా.. వ్యాప్తి వేగంగా ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో ఆరోగ్య వ్యవస్థతో పాటు ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండేందుకు సీడీసీ ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల ఐసొలేషన్ సమయాన్ని ఇప్పటికే కుదించారు. గతంలో ఉన్న నిబంధనలకన్నా తక్కువ రోజుల్లోనే కొవిడ్ సోకిన వారు విధుల్లో చేరుతున్నారు.
తాజా నిబంధనల ప్రకారం.. కొవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి 5 రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాలి. గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. 5 రోజుల తర్వాత లక్షణాలు ఇంకా ఉంటే ఇంట్లోనే ఉండాలి. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు క్వారంటైన్లో ఉండాల్సిన కాలాన్ని కూడా తగ్గించారు. ఐదు రోజులపాటు ఉంటే చాలని వెల్లడించారు. కొవిడ్ బాధితుల్లో లక్షణాలు బయటపడక ముందు రెండు రోజులు, బయటపడ్డాక 3 రోజుల్లోనే వారి నుంచి ఇతరులకు వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నిబంధనలు సడలించినట్లు తెలిపారు. అయితే కొవిడ్ సోకినవారి ఐసోలేషన్ సమయం ముగిశాక మరో 5 రోజుల పాటు ఇతరులతో కలిసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.
10 రోజుల క్వారంటైన్, ఐసొలేషన్ కాలాన్ని 5 రోజులకు కుదించడం రిస్క్తో కూడిన వ్యవహారమే. దీనిపై న్యూయార్క్కు చెందిన వైద్యనిపుణుడు డా. ఆరోన్ గ్లాట్ మాట్లాడారు. ‘బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం 5 రోజుల తర్వాత తగ్గుతుంది. కానీ పూర్తిగా మాయమైపోదు. బాధితుడు ఎక్కడికి వెళ్లినా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే మాస్కులు కచ్చితంగా ధరించాలి’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.