Zydus Cadila: పిల్లల టీకా త్వరలోనే..!
దేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది.
దిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
దిల్లీ: దేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం జైడస్ క్యాడిలా రూపొందించిన టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని దిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. జైడస్ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తి అయినట్లు వెల్లడించింది. టీకా వినియోగ అనుమతి కోసం ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కు దరఖాస్తు చేసుకున్నట్లు దిల్లీ హైకోర్టుకు తెలిపింది. మైనర్లకు కూడా టీకా అందించాలని కోరుతూ దిల్లీకి చెందిన తియా గుప్తా అనే ఓ మైనర్ బాలిక దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
గుజరాత్కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ, ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా తయారైన తొలి కొవిడ్ టీకా. జులై 1వ తేదీన కంపెనీ అత్యవసర అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకొంది. 12 ఏళ్లకు పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుందని వెల్లడించింది. 28వేల మందిపై చేసిన ప్రయోగాల మధ్యంతర ఫలితాల నివేదికను డీసీజీఐకి అందజేసింది. ఒకవేళ దీనికి అనుమతులు వస్తే రెండో భారతీయ టీకాగా నిలుస్తుంది. దీనిని మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జైడస్ క్యాడిలా ప్రకారం.. 0-28-56 రోజుల్లో ఈ టీకా తీసుకోవాలి. రెండు డోసుల టీకా కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు జైడస్ వెల్లడించింది. మరోవైపు చిన్నారుల కోసం కరోనా టీకాను తీసుకువచ్చేందుకు భారత్ బయోటెక్ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల చిన్నారులపై టీకా ప్రయోగాలను మూడు దశల్లో కొనసాగిస్తోంది. 12 నుంచి 18 ఏళ్ల వయసువారిపై ప్రయోగాలు పూర్తికాగా.. ఆరు నుంచి 12 ఏళ్ల పిల్లలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి