అజిత్ ఢోబాల్ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ఢోబాల్ నివాసం,
దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ఢోబాల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాదిని ఈ నెల 6న జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకు 2019 మే నెలలో దిల్లీలోని సర్దార్ పటేల్ భవన్, ఢోబాల్ నివాసంతో పాటు ప్రముఖులు ఉండే పలు ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించానని మాలిక్ వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో పాటు సాంబా సరిహద్దుల్లోనూ తాను రెక్కీ చేపట్టానని, తనతో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్లో ఉన్నట్లు మాలిక్ వెల్లడించినట్టు తెలుస్తోంది.
మాలిక్ సమాచారంతో అప్రమత్తమైన కశ్మీర్ పోలీసులు దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఢోబాల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కశ్మీర్ భద్రతా వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఢోబాల్ ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఉన్నట్లు గతంలో నిఘా సంస్థలు కూడా హెచ్చరించాయి. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులకు ఢోబాల్ వ్యూహకర్తగా వ్యవహరించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.