Nirmala Sitharaman: పాకిస్థాన్ కంటే మా దేశంలోనే వారు బాగున్నారు..: నిర్మలా సీతారామన్
భారత్లో ముస్లింలపై దాడులు జరిగేది నిజమైతే.. వారి జనాభా నానాటికీ ఎలా పెరుగుతుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రశ్నించారు. భారత్లో మైనార్టీలపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు.
వాషింగ్టన్: భారత్ (India)లో ముస్లిం మైనార్టీ (Muslim Minorities)లపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం భారత్ అని ఆమె తెలిపారు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ (Pakistan) కంటే భారత్లోనే ముస్లిం ప్రజల జీవనం మెరుగ్గా ఉందన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman).. వాషింగ్టన్లో పీటర్సన్ ఇన్సిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్లో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై పలువురు ఆమెను ప్రశ్నించారు. దీనికి సీతారామాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్. వారి సంఖ్య పెరుగుతోంది కూడా. వారి జీవితాలు కష్టంగా ఉంటే.. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా?ఆనాడు ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి సంఖ్య నానాటికీ పడిపోతోంది. కానీ, మా దేశంలో ఆ పరిస్థితి లేదు. మా దగ్గర శాంతి భద్రతలనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాస్తవ పరిస్తితులు ఏమాత్రం తెలుసుకోకుండా ఇలా దేశాన్ని నిందించడం సరికాదు’’ అని ఆమె మండిపడ్డారు.
భారత్లో ఉన్న ముస్లింలు.. పాకిస్థాన్ (Pakistan) ప్రజల కంటే మెరుగ్గా జీవిస్తున్నారని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు రాసిన వారు భారత్కు రావాలని నిర్మలమ్మ ఆహ్వానించారు. దేశమంతా ఒంటరిగా తిరిగి తమ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.