Coronavirus: కొత్త వేరియంట్ కలవరం వేళ.. చుక్కల మందు టీకాకు కేంద్రం ఆమోదం
కరోనా మహమ్మారి విజృంభణ ధాటికి ప్రస్తుతం చైనా విలవిల్లాడుతోంది. మునుపెన్నడూ లేనంతగా అక్కడ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు(Covid-19) పెరుగుతోన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని చర్యలు చేపడుతోంది. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేశాలు అందాయి. ఈ క్రమంలోనే దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా(Two-drop nasal vaccine)కు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి టీకా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే లభ్యం కానుంది. అయితే, ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్ బూస్టర్(Heterologous booster)గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందు టీకా ‘ఇన్కొవాక్’ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నవంబర్లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా.. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్ ప్లాట్ఫాంలో అందుబాటులోకి రానుంది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు వీలుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
కొత్త మార్గదర్శకాల దిశగా కేంద్రం..
ప్రపంచ దేశాల్లో కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో క్రిస్మస్, కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ‘మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు. ఈ పండగ సీజన్లో అందరు కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం ఆవశ్యకం. చైనా, కొరియా, బ్రెజిల్ నుంచి ప్రారంభమైన కొవిడ్.. దక్షిణాసియాకు వ్యాపించింది. 20 నుంచి 35 రోజుల్లో భారత్కు వచ్చింది. తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగుచూస్తున్నాయని, ఈ జాబితాలో జపాన్ ముందువరుసలో ఉందని తెలిపింది. ప్రస్తుతం చైనాలో ఆర్ ఫ్యాక్టర్ 16గా ఉందని పేర్కొంది. అలాగే చైనాలో కనిపిస్తోన్న ఉద్ధృతికి గల కారణాలను ప్రస్తావించింది. మెరుగైన సామర్థ్యంలేని టీకాలు, తక్కువస్థాయి వ్యాక్సినేషన్, జీరో కొవిడ్ వ్యూహం వల్ల సంబంధిత నిరోధకత లభించకపోవడం, ఒక్కసారిగా ఎత్తివేసిన ఆంక్షలు అక్కడి పరిస్థితి కారణమని అధ్యయనాలను ఉటంకించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం