భారత్‌-యూఎస్ రక్షణ భాగస్వామ్యం భేష్‌‌!

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌, అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని యూఎస్‌ రక్షణ మంత్రి జేమ్స్‌ ఆస్టిన్‌ ప్రశంసించారు. ఆస్టిన్‌ శుక్రవారం రాత్రి భారత జాతీయ భద్రతా సలహాదారు

Published : 20 Mar 2021 11:39 IST

దిల్లీ: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌, అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని యూఎస్‌ రక్షణ మంత్రి జేమ్స్‌ ఆస్టిన్‌ ప్రశంసించారు. ఆస్టిన్‌ శుక్రవారం రాత్రి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం సమావేశానికి సంబంధించిన విషయాల్ని ట్విటర్‌లో వెల్లడించారు. ‘భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో గొప్ప సమావేశం జరిగింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కీలకమైన సవాళ్లపై రెండు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఈ సహకారమే రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం ప్రాధాన్యతను తెలియజేస్తోంది’ అని ఆస్టిన్‌ ట్వీట్‌లో తెలిపారు.

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ ఆస్టిన్‌ శుక్రవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నిన్న సాయంత్రం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆస్టిన్‌తో మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అంతేకాకుండా అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని