US: హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. ఆ నిబంధన సడలింపు కానీ..
ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్తో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ.. హెచ్-1బీ సహా పలు రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసా హెచ్-1బీతో పాటు, హెచ్-3, హెచ్-4, ఎల్, ఓ, పీ, క్యూ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. 2022, డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దీనిపై తుది నిర్ణయం కాన్సులర్ అధికారులదే అని వెల్లడించింది. స్థానిక పరిస్థితులను బట్టి ఎంబసీ, కాన్సులేట్లకు అవసరమైతే వ్యక్తిగత ఇంటర్వ్యూలు పెట్టే అధికారాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల, దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు తమ సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్సైట్లను పరిశీలిస్తుండాలని సూచించింది.
సాధారణంగా అమెరికాలో ఏ వీసాల జారీకైనా ఇదే తుది ప్రక్రియ. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అమెరికా కాన్సులేట్ సిబ్బంది దరఖాస్తుదారులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. అందులో ఎంపికైతేనే వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 2022లో ఈ ఇంటర్వ్యూ విధానాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి, వీసాల జారీని మరింత సులభతరం చేయాలని అమెరికా సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్-1బీ వీసా సహా పలు రకాల వీసాల జారీలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేసే అవకాశాన్ని కాన్సులర్ అధికారులకు కల్పించినట్లు తెలిపింది.
ఇప్పటివరకు ఏదైనా వీసా పొందిన వారు, వీసా మినహాయింపు ప్రోగ్రామ్లోని సభ్య దేశాల పౌరులు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద గతంలో అమెరికా వెళ్లి వచ్చిన వారు.. ఇప్పుడు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు చేసే విచక్షణాధికారం కాన్సులేట్ అధికారులకు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం