WHO అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం!
ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ లైసెన్స్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
అత్యవసర వినియోగ లైసెన్స్పై సీరం ఇన్స్టిట్యూట్
ముంబయి: ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ లైసెన్స్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇప్పటికే అందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందించామని, వచ్చే ఒకటి, రెండు వారాల్లోనే అనుమతి రానున్నట్లు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ఇదివరకే ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుమతి ద్వారా నియంత్రణ సంస్థల అనుమతులు లేకుండానే ఆయా దేశాల్లో వ్యాక్సిన్లను నేరుగా వినియోగించే వీలుంటుంది.
భారీ స్థాయిలో నోవావాక్స్..
అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ను భారత్లోనూ భారీ స్థాయిలో నిల్వ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఏప్రిల్ నుంచి నెలకు దాదాపు 4 నుంచి 5కోట్ల డోసులను నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది. ఇక నోవావాక్స్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను తయారీ చేసేందుకు ఆ సంస్థతో సీరం ఇన్స్టిట్యూట్ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, ప్రతిఏటా 200కోట్ల నోవావాక్స్ వ్యాక్సిన్ డోసులను భారత్లో ఉత్పత్తి చేయనుంది.
భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో ఒకటనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తిని మాత్రం భారత్లో చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రముఖ సీరం ఇన్స్టిట్యూట్తో పాటు భారతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తోండగా, నోవావాక్స్, కొడాజెనెక్స్ వంటి సంస్థల వ్యాక్సిన్లను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయనుంది.
250కోట్ల డోసుల ఉత్పత్తి..
సీరం ఉత్పత్తి చేస్తోన్న ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ ప్రతి మూడు నెలలకొకసారి కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో పంపిణీ కార్యక్రమం నడుస్తోందని, జనవరి చివరి నాటికి విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 100కోట్ల డోసులను సరఫరా చేస్తామని అదర్ పూనావాలా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 150కోట్ల డోసులు ఉండగా, ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 250కోట్ల డోసులకు పెంచుతామని అన్నారు. ఇదిలాఉంటే, జనవరి 16నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 1.1కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం సేకరించింది.
ఇవీ చదవండి..
తొలిరోజు..3లక్షల మందికి టీకా
8నెలల్లో..చైనాలో తొలి కరోనా మరణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.