Lockdown: ఆ పరిస్థితి వస్తేనే ముంబయిలో లాక్డౌన్.. మేయర్ వెల్లడి
రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుండటంతో.. దిల్లీ, ముంబయి తదితర మెట్రో నగరాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. దిల్లీలో ఈ వారాంతం నుంచి వీకెండ్ కర్ఫ్యూ విధించనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. ఇదే క్రమంలో...
ముంబయి: రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుండటంతో.. దిల్లీ, ముంబయి తదితర మెట్రో నగరాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. దిల్లీలో ఈ వారాంతం నుంచి వీకెండ్ కర్ఫ్యూ విధించనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటన కూడా జారీ చేసింది. ఇదే క్రమంలో.. ముంబయిలోనూ రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్డౌన్ విధిస్తామని మేయర్ కిశోరి పెడ్నేకర్ మంగళవారం వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. ముంబయిలో సోమవారం 8,082 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 18 తర్వాత అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే. దీంతోపాటు కొత్తగా 40 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే, వీరిలో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. కొవిడ్ కారణంగా ముంబయిలోని ఆసుపత్రుల్లో చేరికలూ గత నాలుగు రోజుల్లో 15 శాతానికి పెరిగినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 574 మంది దవాఖానాల్లో చేరారు. బృహన్ముంబయి మున్సిపాలిటీ(బీఎంసీ) వివరాల ప్రకారం.. నగరంలోని 30,565 కొవిడ్ పడకల్లో 12.2 శాతం, 2,720 ఐసీయూ బెడ్లలో 14 శాతం నిండిపోయాయి. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే జంబో కేంద్రాలు పడకలను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఇదిలా ఉండగా.. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో నగరంలో ఒకటి నుంచి తొమ్మిది, 11 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను జనవరి 31 వరకు నిలిపేయాలని బీఎంసీ నిర్ణయించింది. అపార్ట్మెంట్లు, గృహ సముదాయాల్లో 20 శాతం కంటే ఎక్కువ నివాసాల్లో కేసులు బయటపడితే.. మొత్తంగా ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.