Rajasthan:సోదరి ఆడపడుచుతో యువతి ప్రేమాయణం.. ఆ తర్వాత ఏమైందంటే...

ఇద్దరు యువతుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌ చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో జరిగింది. హరియాణాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని తన

Updated : 14 Jan 2022 19:58 IST

ద్దరు యువతుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌ చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో జరిగింది. హరియాణాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అది ఇరువురి మధ్య ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు. గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపుర్‌ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. అనంతరం ఇరువురు ఫతేబాద్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జింద్‌లో గత రెండు నెలలుగా కలిసి జీవిస్తున్నారు. రతన్‌గఢ్‌ యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 12న పోలీసులు ఆ ఇద్దరు యువతులను గుర్తించారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతులు తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెగేసి చెప్పేశారు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక వారిని పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని