Nitin Gadkari: ఇది ‘బాహుబలి’ బారియర్.. ప్రపంచంలోనే మొదటిది!
ప్రపంచంలోనే మొదటిసారి ఓ వెదురు బారియర్ను మహారాష్ట్రలోని వణి- వరోరా హైవేపై ఏర్పాటు చేశారు. ఇదొక అసాధారణ విజయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ముంబయి: సాధారణంగా మనకు రహదారుల వెంబడి స్టీల్ బారియర్లు కనిపిస్తాయి. కానీ, ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బారియర్(Bamboo Crash Barrier)ను మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ హైవేపై ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రాపూర్, యావత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వణి- వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంతోపాటు స్థానిక వెదురు రంగాని(Bamboo Industry)కి ఇది గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యావరణహిత వెదురు బారియర్లు.. ఉక్కు వాటి(Steel Barriers)కి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్ చేశారు.
‘వణి- వరోరా హైవేపై 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బారియర్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇదొక అసాధారణ విజయం’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ వెదురు బారియర్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్(NATRAX), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్(CBRI) వంటి ప్రభుత్వ సంస్థల్లో అనేక కఠిన పరీక్షలు నిర్వహించిన అనంతరం దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గుర్తింపు కూడా పొందినట్లు తెలిపారు. ‘బాంబూసా బాల్కోవా’ వెదురు జాతితో వీటిని తయారు చేసినట్లు చెప్పారు. ఈ వెదురు బారియర్ల పునర్వినియోగం విలువ 50-70 శాతం ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే ఉక్కు బారియర్ల రీసైక్లింగ్ వాల్యూ 30-50 శాతం మాత్రమేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు