Trisha: తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించనున్న త్రిష 

సోనీ ఓటీటీ లైవ్‌లో ప్రసారం రాబోయే ఈ సిరీస్‌కి ‘బృందా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. క్రైమ్‌- ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది.

Published : 16 Oct 2021 23:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలి కాలంలో ప్రముఖ హీరోయిన్‌లు అందరూ ఓటీటీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమంత, కియారా అడ్వాణీ, తమన్నా, కాజల్‌, ప్రియమణి, సాయి పల్లవి తదితరులు ఇప్పటికే ఈ బాటలో నడిచారు. తాజాగా ఆ జాబితాలో నటి త్రిష కూడా చేరనున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది భామ త్రిష.. తొలిసారి తెలుగు వెబ్‌సిరీస్‌లో నటించనుంది. ఇదే విషయాన్ని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వెల్లడించింది. సోనీలివ్‌ ఓటీటీలో ప్రసారం రాబోయే ఈ సిరీస్‌కి ‘బృందా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. క్రైమ్‌- ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. దర్శకుడు సురేష్‌ వంగలా దీనికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్‌ కొల్లా ఈ సిరీస్‌తో నిర్మాత అవతారమెత్తనున్నారు.  సూర్యవంగలా కథ అందించగా.. శక్తికాంత్‌ కార్తిక్‌ స్వరాలు సమకూర్చనున్నారు. నటులు సాయికుమార్‌, ఆమని, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, రవీంద్రా విజయ్‌, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు