అందుకే పాస్టర్గా మారాల్సి వచ్చింది: రాజా
వెండితెరకు దూరమైన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు ఎక్కడున్నారు..? ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఇలాంటివి తెలుసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘ఆలీతో సరదాగా’. వారి జీవిత విశేషాలను, సినీ రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రేక్షకులకు తెలియజేస్తోందీ ‘ఆలీతో సరదాగా’.
హైదరాబాద్: వెండితెరకు దూరమైన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటివి తెలుసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘ఆలీతో సరదాగా’. వారి జీవిత విశేషాలను, సినీ రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రేక్షకులకు తెలియజేస్తోందీ కార్యక్రమం. వారం వారం సెలబ్రెటీల మాట-ముచ్చట్లతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో తాజాగా కథానాయకుడు రాజా పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
షోలో భాగంగా ‘కథానాయకుడిగా చిత్రాలతో బిజీగా ఉండి ఒక్కసారిగా పాస్టర్ ఎందుకు అయ్యారు?’ అని ఆలీ అడగ్గా.. ‘సినిమాలపై ఆసక్తి కోల్పోయాను. అనుకోకుండా అలా జరిగింది’ అని రాజా చెప్పారు. అలాగే ‘మీరు రిసెప్షనిస్ట్గా పని చేశారా?’ అని ప్రశ్నించగా.. ‘అవును, నేను ఇక్కడే గ్రీన్ పార్క్లో పనిచేశాను’ అని బదులిచ్చారు. ‘చిన్నప్పుడు మీ అమ్మ, నాన్నతో కలిసి చర్చికి వెళ్లేవారా?’ అని ఆలీ అడగ్గా.. ‘అమ్మ నాకు గుర్తులేదు. నేను ఐదేళ్లు ఉన్నప్పుడే మరణించారు. తర్వాత నాన్న 14 ఏళ్లు ఉన్నప్పుడు మరణించారు. నాకు ఆ దేవుడు ఒక అమ్మని తీసుకెళ్లినా.. ఇద్దరు అక్కలను అమ్మలుగా ఇచ్చాడు’ అంటూ రాజా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎవరైనా కుర్రాళ్లు వచ్చి నిన్ను స్ఫూర్తిగా తీసుకొని చిత్ర పరిశ్రమకు వెళ్లాలనుకుంటున్నాను అని అడిగితే మీరేం చెప్తారు?’ అని ఆలీ ప్రశ్నించగా.. ‘వద్దంటాను’ అని ఆయన సమాధానమిచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు వద్దంటున్నారు? రాజా ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తల వెనుక నిజమెంత? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం (డిసెంబర్ 14)న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే.. అప్పటి వరకు మరీ ఈ ప్రోమోను చూసేయండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్