టాలీవుడ్కు సీఎం కేసీఆర్ హామీలు
కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ మేనిఫెస్టోలో టాలీవుడ్కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా.. 1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందిస్తామని చెప్పారు.
హైదరాబాద్: కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా..
1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందించడం.
2. థియేటర్ల యాజమాన్యం రోజూవారి ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడం.
3. సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం.
4. థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని తెరాస ప్రకటించింది.
వీటితో పాటు థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీపెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం అన్నారు.
సీఎం కేసీఆర్ను పలువురు సినీ ప్రముఖులు ఈ నెల 22న (ఆదివారం) మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన టాలీవుడ్ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలనను ప్రస్తావిస్తామని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్కు కృతజ్ఞతలు...
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీఆర్ నిర్ణయాలు ఈ కష్ట సమయంలో చిత్ర పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుంది. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి, దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని చిరు పేర్కొన్నారు. మరో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కూడా కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చిత్ర పరిశ్రమ అధిగమించాలంటే ఈ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్ను రామ్చరణ్ రీట్వీట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. థియేటర్లు రీ-ఓపెనింగ్కు జీవో ఇవ్వడంతో పాటు సినీ పరిశ్రమలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సయుక్తా మేనన్. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు