ఇతడే నా జీవిత భాగస్వామి: అవికాగోర్‌

బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన నటి అవికా గోర్‌ తన ప్రియుడ్ని పరిచయం చేశారు. తను, మిలింద్‌ చద్వానీ ప్రేమలో ఉన్నామని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేశారు. ‘నా ప్రార్థనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్‌ దొరికింది. మనల్ని అర్థం చేసుకుని..

Published : 12 Nov 2020 01:03 IST

ప్రియుడ్ని పరిచయం చేసిన నటి

ముంబయి: బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన నటి అవికా గోర్‌ తన ప్రియుడ్ని పరిచయం చేశారు. తను, మిలింద్‌ చద్వానీ ప్రేమలో ఉన్నామని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేశారు. ‘నా ప్రార్థనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్‌ దొరికింది. మనల్ని అర్థం చేసుకుని.. నమ్మి.. స్ఫూర్తినింపి.. మన అభివృద్ధిలో సాయం చేసి.. మనల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి మనం అర్హులం. కానీ అలాంటి వ్యక్తి దొరకడం అసాధ్యమని చాలా మంది అనుకుంటారు. కాబట్టి నాకు ఇదంతా కలలా ఉంది. కానీ జరుగుతున్నది నిజమే, నిజమే... మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తా. ఇవాళ నేను ఎలా ఫీల్‌ అవుతున్నానో.. అదే భావన మీరూ పొందాలని ఆశిస్తున్నా’.

‘నాకు ఈ అనుభూతిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ బంధం నా జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం మాకు లేదు. నన్ను సంతోషంగా ఉంచేందుకు నా జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు, అది నాకు ఎంతో అందమైన అనుభవంలా అనిపిస్తోంది. ఈ ఇడియట్‌ నా హృదయాన్ని కదిలించాడని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు థాంక్స్‌ మిలింద్‌ చద్వానీ. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నా..’ అని ఆమె ఫొటోలు షేర్‌ చేశారు.

అవికా బాలనటిగా కెరీర్‌ ఆరంభించారు. పలు టీవీ సీరియళ్లతోపాటు సినిమాల్లోనూ నటించారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల నాజూకుగా మారి, అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఏడాది క్రితం తన శరీరాకృతి వల్ల ఎంతో బాధపడ్డానని, అందుకే వర్కౌట్లు చేసి సన్నగా మారారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని