ఆయనకు నటులు సైతం సలాం కొట్టారు..
సినీ ప్రపంచం ఆయన మృతికి ఎంతో బాధపడింది అని రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సీనియర్ నటుడు రంగనాథ్ గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. ‘‘ఆయన ఓ అద్భుతమైన నటుడు.
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రపంచం ఆయన మృతికి ఎంతో బాధపడింది అని రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సీనియర్ నటుడు రంగనాథ్ గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. ‘‘ఆయన ఓ అద్భుతమైన నటుడు. చాలా మంచి పాత్రల్లో నటించారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ ప్రీ క్లైమాక్స్లో ఆయన నటనకు, మాట్లాడిన మాటలకు ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య లాంటి వాళ్లు సినిమా చూసి థియేటర్లోనే ఆయనకు నిల్చొని సలాం కొట్టారు. ‘ప్రేమంటే ఇదేరా’, ‘కలిసుందాం రా’ చిత్రాల్లో చాలా గొప్పగా నటించారు’’ అని పరుచూరి అన్నారు.
‘‘ఒక్కసారిగా ఎప్పుడైతే ఈ దర్శకులు హిందీ, తమిళనాడు మార్కెట్ను పెంచటం కోసం మన వాళ్లని వదిలేసి బయట వాళ్ల దగ్గరికి వెళుతున్నారో .. వీళ్లకి పాత్రలు ఆగిపోవటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. చిత్ర పరిశ్రమకు రాకముందు చనిపోవాలనుకొని రైలు ముందు నిలబడి మళ్లీ ఎందుకో విరమించుకున్నారని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. చనిపోవాలి అనే కోరిక భావోద్వేగానికి గురయిన ఓ క్షణంలో వస్తుంది. ఆ సమయంలో మౌనంగా ఆ క్షణాన్ని దాటేస్తే వాళ్లు మరణించరు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. కానీ, ఆయన ఏది ఆపారో దాంతోనే ముగించారు అంటే ఆ మనసు మారలేదు. అది తట్టుకోలేనితనానికి ముగింపే జీవితానికి ముగింపే కారణం తప్ప మరొక మార్గం లేదు అనే ఆలోచన తప్పు. దయచేసి తల్లిదండ్రలారా.. మీ పిల్లల ముఖంలో ఏదైనా బాధ కనపడితే వెంటనే వారిని ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకొని సమస్యను కనుక్కొని పరిష్కరించండి. అప్పుడు ఇలా ప్రేమ, పరీక్షలు అంటూ జరిగే ఆత్మహత్యలు ఆగిపోతాయి అని నా విశ్వాసం’’ అని ఆయన చెప్పారు.
‘‘ఒక్కసారి మీరందరూ రంగనాథ్ గారు నటించిన ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చిత్రాన్ని చూడండి. మూడు లక్షలతో తీసిన అద్భుతమైన చిత్రం ఇది. 175 రోజులు విశాఖపట్నంలో ఆడింది. ఆయన అద్భుతమైన కవితలు రాశారు. అంతటి కవి హృదయం కలిగిన ఆయన జీవితాన్ని అలా ముగించటం సమంజసం కాదు. ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంలోని ఓ సన్నివేశం కోసం రఘుబాబు పరిషత్లో మేము ఓ నాటకాన్ని చూస్తుంటే ఓ కూతురు అబ్బాయితో వెళ్లిపోదామని చూస్తుంటే తండ్రి ఆపి లేఖ రాయిస్తాడు. ఈ సన్నివేశం మాకు కావాలి అని రామానాయుడు గారితో ఆ ఒక్క సన్నివేశానికి పదిహేను వేలు ఆ రచయితకు ఇచ్చి దాన్ని ఈ చిత్రంలో పెట్టాము’’ అని ఆయన తెలిపారు.
‘‘ఓ సినిమాకి హీరో స్తంభం అయితే, మిగతా ఆర్టిస్ట్ లు పైకప్పులు అవుతారు. అవన్నీ లేకపోతే ఓ అందమైన భవంతి నిర్మాణం మనం చేయలేం. అదే విధంగా ఆ పాత్రకు వాళ్లు సరిపోకపోతే సినిమా దెబ్బతింటుంది. ఫలానా వాళ్లు చేస్తేనే ఈ పాత్ర బాగుంటుంది అని పోరాడి తీసుకొస్తాం. రంగనాథ్ గారు ఓ మంచి బేస్ వాయిస్తో, ఆరడుగుల ఎత్తుతో, అద్భుతమైన డైలాగులు చెప్తుంటే చూపు తిప్పుకోలేరు. ఓ మంచి ఆజానుబాహుడైన నటుడిని కోల్పోవడం చాలా బాధాకరం’’ అని ఆయన ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం