aa okkati adakku: పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఇది మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాజీవ్ గురువారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
- ‘‘సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతోనే నేనీ చిత్రసీమలోకి వచ్చాను. మా యానిమేషన్ సంస్థలో రూపొందించిన ‘ఛోటా భీమ్’ పెద్ద హిట్టయ్యాక మరో ఆరు యానిమేషన్ సినిమాలు చేశాం. అలా మా కంపెనీ పూర్తిగా స్థిరపడ్డాక నిర్మాతగా సినిమాల్లోకి రావాలనుకున్నా. కాకపోతే దీనికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఇక రెండేళ్ల క్రితం నిర్మాతగా తొలి అడుగు వేయాలనుకున్నప్పుడు మల్లి అంకం ఈ కథ చెప్పారు. పెళ్లి చుట్టూ తను అల్లుకున్న కథ నాకు బాగా నచ్చింది. వినోదం, భావోద్వేగాలతో పాటు అన్నిరకాల వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్నే మా తొలి చిత్రంగా పట్టాలెక్కించాం’’.
- ‘‘నాకు ఈ కథ విన్నప్పుడే ఇది అల్లరి నరేశ్కు సరిగ్గా సరిపోతుందనిపించింది. మేము ఈ స్క్రిప్ట్ వినిపించే సమయానికి ఆయన మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నా.. తన కోసం వేచి చూసి ఈ చిత్రం చేశాం. దీనికి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్ను సూచించింది అల్లరి నరేశే. సినిమాలో ఆయన్ని పెళ్లి ఎప్పుడని అడిగినప్పుడల్లా తను చిరాకుతో చెప్పే డైలాగ్ ఇది. నరేశ్ నాన్నగారి క్లాసిక్ సినిమా టైటిల్ను దీనికి పెట్టడం వల్ల మాపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందని నమ్మకం కలిగాకే ఆ పేరును ఈ చిత్రానికి ఖరారు చేశాం’’.
- ‘‘ఈరోజుల్లో జీవితంలో స్థిరపడటం కంటే పెళ్లి అవ్వడమనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిత్రంలో హీరోది కూడా అదే సమస్య. సబ్ రిజిస్ట్రార్గా తన చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించిన అతనికి 35ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మరి తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలేంటి? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అన్నది వినోదాత్మకంగా చూపించాం. ఇది ఈతరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్లు ఉన్నాయి. స్క్రీన్ప్లే ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేస్తుంది’’.
- ‘‘ప్రస్తుతం మేము ‘ఛోటా భీమ్’ను పిల్లలతో రియల్ యానిమేషన్ పద్ధతిలో చేస్తున్నాం. డిస్నీలో ఒక యానిమేషన్ షో ప్రారంభించనున్నాం. అలాగే ప్రభాస్ ‘కల్కి 2898ఎ.డి’ చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ యానిమేషన్ కాన్సెప్ట్ను సిద్ధం చేస్తున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
‘హీరామండీ’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా