Lalitha: నటి కేపీఏసీ లలిత కన్నుమూత
సీనియర్ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి
సీనియర్ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టారు. లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. నాటకాలపై ఆసక్తితో కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ)లో చేరి నటిగా కెరీర్ మొదలుపెట్టి కేపీఏసీ లలితగా గుర్తింపు పొందారు. 550పైగా చిత్రాల్లో నటించారు. అలాగే అమరం (1991), శాంతమ్ (2000) చిత్రాల్లోని నటనకు గానూ రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారామె. అంతేకాకుండా కేరళ సంగీత అకాడెమీ ఛైర్మన్గా పనిచేశారు. పలు ధారావాహికల్లోనూ లలిత నటించారు. 1978లో ప్రముఖ దర్శకుడు భరతన్తో ఆమె వివాహం జరిగింది. 1998లో ఆయన చనిపోయారు. ఆ దంపతులకు కుమార్తె శ్రీకుట్టి, కుమారుడు సిద్ధార్థ్ భరత్ను ఉన్నారు. సిద్ధార్థ్ నటుడు, దర్శకుడిగా మలయాళంలో గుర్తింపు పొందారు. లలిత మృతిపట్ల ప్రముఖ మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్లాల్, సురేష్ గోపీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..