రండి.. ఆకలిని తరిమేద్దాం: సోనమ్‌కపూర్

ఆకలిని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా బాలీవుడ్‌ నటి సోనమ్ కపూర్‌ ఐక్యరాజ్యసమితితో చేతులు కలిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్య్లూఎఫ్‌పీ) 2020 నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితికి

Published : 14 Dec 2020 00:05 IST

ముంబయి: ఆకలిని అంతం చేసే పోరులో అందరూ భాగస్వామ్యం కావాలని బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ తన అభిమానులను కోరారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్య్లూఎఫ్‌పీ) 2020 నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి ఈ నటి శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో ‘మిషన్ టు ఎండ్ హంగర్’ అనే ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. మార్పులో మీరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. డబ్ల్యూఎఫ్‌పీ సైతం సోనమ్‌కపూర్‌ పాత్రను కొనియాడింది.

‘ఆకలి లేని సమాజాన్ని నిర్మించడం ప్రస్తుతం మన ముందున్న పెద్ద సవాల్‌. కానీ.. మనందరం కలిస్తే.. ప్రతి రోజు ఆకలితో పడుకునే 690 మిలియన్ల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలం’ అని డబ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. ప్రతి ఏడాది 80కి పైగా దేశాల్లో 100 మిలియన్ల మందికి భోజనం అందిస్తున్నట్లు వివరించింది. అయితే.. గమ్యాన్ని చేరడంలో సోనమ్‌కపూర్‌ అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసింది.

సోనమ్‌ కపూర్‌ చివరగా 2019లో ‘ది జోయా ఫాక్టర్‌’ సినిమాలో కనిపించింది. అందులో ఆమె దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం అనిల్‌ కపూర్‌ హీరోగా ‘ఏకే వర్సెస్‌ ఏకే’ చిత్రంలోనూ సోనమ్‌ నటిస్తోంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

ఇదీ చదవండి..
స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. రష్మి కౌంటర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని