‘అవతార్2’ కోసం నటి సాహసం
ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దృశ్య కావ్యాల్లో ‘అవతార్’ సిరీస్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రముఖ
ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దృశ్య కావ్యాల్లో ‘అవతార్’ సిరీస్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సామ్ వర్తింగ్స్టన్, క్లిఫ్ కర్టిస్, కేట్ విన్స్లెట్, బ్రెన్ డన్ కవెల్ వంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ‘అవతార్ 2’ చిత్రీకరణ పూర్తికాగా.. ‘అవతార్ 3’ సైతం 95శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగం పండోరా గ్రహం నేపథ్యంలో సాగగా.. ఇప్పుడు రానున్న రెండో భాగం సముద్ర గర్భం నేపథ్యంలో ఉండనుంది.
ఇందుకోసమే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం నటి కేట్ విన్స్లెట్ ఓ పెద్ద సాహసం చేసింది. ఒక సీన్ చిత్రీకరణ కోసం ఆమె నీటి అడుగున దాదాపు 7నిమిషాల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టింది.
‘‘అవతార్’లో నా పాత్రను పోషించడానికి నీళ్లలో ఫ్రీ డైవ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. నమ్మశక్యం కాని మరో విషయం ఏంటంటే.. ఓ సీన్ కోసం నీటి అడుగున 7నిమిషాల 14సెకన్ల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నా’’ అని చెప్పుకొచ్చింది కేట్ విన్స్లెట్. దీంతో పాటు నీటు అడుగున చిత్రీకరణలో ఉన్న తన చిత్రాన్ని ఒకటి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు