Bigg boss 7 telugu: బిగ్బాస్ సీజన్-7 ‘2.ఓ’ షురూ.. వైల్డ్ కార్డ్తో హౌస్లోకి వెళ్లింది వీళ్లే!
బిగ్బాస్ సీజన్-7లో ‘2.ఓ’ షురూ అయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపాడు బిగ్బాస్
హైదరాబాద్: గత సీజన్లకు భిన్నంగా ‘బిగ్బాస్ సీజన్-7’ (Bigg Boss Telugu7) సాగుతోంది. ‘ఉల్టా పుల్టా’ అంటూ దాదాపు ఐదు వారాల కిందట మొదలైన ఈ సీజన్లో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ ఐదు వారాల్లో ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను బయటకు పంపిన బిగ్బాస్ ఈ ఆదివారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణల డబుల్ ఎలిమినేషన్తో షాకిచ్చాడు. ఆ కాసేపటికే గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్ను పంపి, మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, సీజన్-7 ‘2.ఓ’ షురూ చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ (wild card entry contestants) ద్వారా హౌస్లోకి పంపాడు.
షాకింగ్.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. శుభశ్రీ, గౌతమ్ ఔట్.. కానీ!
అంబటి అర్జున్ (Ambati Arjun), అశ్వినీ శ్రీ (Ashwini Sri), భోలే షావలి (Bhole Savali), పూజా మూర్తి (Pooja Murthy), నయని పావని (Nayani Pavani)లు హౌస్లోకి అడుగు పెట్టారు. ఈ వీకెండ్ ఎపిసోడ్కి ‘చిన్నా’ ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్ వచ్చి హౌస్మేట్స్తో పాటలు పాడి, డ్యాన్స్ చేయించారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్లో భాగంగా ఆ సినిమా హీరోయిన్స్తో కలిసి రవితేజ వచ్చి బిగ్బాస్ వేదికపై సందడి చేశారు.
అంబటి అర్జున్
ప్రస్తుతం బిగ్బాస్-7లో సీరియల్ నటులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో అంబటి అర్జున్ (Ambati Arjun) చేరారు. సీరియల్ ఆర్టిస్ట్గా, డ్యాన్సర్గా, యాంకర్గా.. ఇలా తను మల్టీ టాలెంటెడ్. అర్జున్ అసలు పేరు అంబటి నాగార్జున. ఐదు వారాలు బిగ్బాస్ చూడటం తనకు కాస్త అడ్వాంటేజ్ అని అర్జున్ అన్నాడు. ‘ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని ఉండటం వల్ల వాళ్లతో ఎలా నడుచుకోవాలో అర్థమైంది. మరోవైపు ఇప్పటికే హౌస్లో ఉన్న వాళ్లకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉంటుంది. వాళ్లకే మద్దతు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ‘ఇప్పటివరకూ నువ్వు ఆట చూసి ఇక్కడకు వచ్చావు’ అని హౌస్లోని వాళ్లు అంటారు. వాటిని భరించాలి. బిగ్బాస్ హౌస్లో దమ్ముగా ఆడుతున్న వ్యక్తులు యావర్, ప్రశాంత్ కాగా, దమ్ముగా ఆడని వారు అమర్, సందీప్. అమర్ ఆడకుండా ఉంటాడని మేము అస్సలు అనుకోలేదు. చెప్పే పాయింట్ కూడా సరిగా ఉండటం లేదు. సందీప్ ప్రతి చిన్నదానికి గొడవకు వెళ్తున్నారు’’ అని అర్జున్ చెప్పి, హౌస్లోకి వెళ్లాడు.
అశ్విని శ్రీ
‘బిగ్ బాస్ సీజన్ 7’లో అలరించేందుకు సిద్ధమైంది మరో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అశ్విని శ్రీ (Ashwini Sri). వైల్డ్కార్డ్ ద్వారా ఎంట్రీ దక్కించుకున్న ఈ అశ్విని.. రతిక వెళ్లిపోయిన లోటును భర్తీ చేస్తుందని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా అశ్వినీ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరిక మేరకు చదువు పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ‘నాకు కోపం ఎంత ఉందో.. ప్రేమ కూడా అంతే ఉంది. హౌస్లో ఉన్నవాళ్లలో బాగా ఆడుతున్న వ్యక్తులు శివాజీ, పల్లవి ప్రశాంత్లు కాగా, ప్రియాంక, శోభాశెట్టి ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. చిన్నప్పటి నుంచి ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాను. నేను కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నా’’ అంటూ అశ్విని శ్రీ చెప్పి, హౌస్లో అడుగు పెట్టింది.
భోలే షావలి
ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్తో నెటిజన్లకు బాగా చేరువైన వారిలో భోలే షావలి (Bhole Savali) ఒకరు. తెలంగాణ పాటలతో ఫేమస్ అయిపోయి యూట్యూబ్లో లక్షల మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో భోలే షావలి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టాడు. అమ్మ పాట తనకు పాఠమై బువ్వ పెడితే , బిగ్బాస్ పిలుపు తనకు ఊపునిచ్చిందని చెప్పాడు. ‘భోలే షావలి అంటే, వరంగల్ జిల్లాలో దర్గా ఉంది. చిన్నప్పుడు మా అమ్మానాన్న అక్కడ మొక్కుకున్నారు. ఆ పేరు నాకు పెట్టారు. పాట ఉన్నా లేకపోయినా ఊపులోనే ఉంటా. రైతు బిడ్డకు పోటీగా నేను పాట బిడ్డ అని పెట్టుకోలేదు’ అని భోలే షావలి చెప్పాడు. అనంతరం నాగార్జునపై పాట పాడాడు. శివాజీ, ప్రశాంత్ హౌస్లో బాగా ఆడుతుండగా, అమర్దీప్ సరిగా ఆడటం లేదనిపిస్తోందని భోలే షావలి అన్నాడు.
పూజా మూర్తి
బిగ్బాస్-7లో అడుగు పెడుతున్న మరో సీరియల్ నటి పూజా మూర్తి (Pooja Murthy). ‘గుండమ్మ కథ’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. అసలు ఈ సీజన్ ఆరంభంలోనే ఆమె హౌస్లో అడుగు పెట్టాల్సి ఉంది. షో ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు ఆమె తండ్రి చనిపోవడంతో విరామం తీసుకుంది. ‘నాన్న చనిపోయారన్న బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బిగ్బాస్కు వెళ్తున్నానని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. నన్ను ఈ వేదికపై చూడాలనుకున్నారు. అందరితో సరదాగా ఉంటాను. ఆటపట్టిస్తాను. హౌస్లో కూడా అలాగే ఉంటాను. ఇక ఇప్పటివరకూ హౌస్లో ఉన్న వాళ్లలో దమ్మున్న ఆటగాళ్లు శివాజీ, సందీప్ మాస్టర్. ఇక దుమ్ముగా ఆడేవాళ్లలో తేజ ఒకరు.
నయని పావని కూడా..
బిగ్బాస్లో అడుగుపెట్టిన మరో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, టిక్ టాక్ స్టార్ నయని పావని (Nayani Pavani). టిక్ టాక్ వీడియోల్లో తనదైన హావభావాలతో అదరగొట్టేది. తెలంగాణ అమ్మాయి అయిన నయని, టిక్ టాక్తో వచ్చిన క్రేజ్తో ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. హౌస్లో దమ్ముతో ఆడుతున్న వాళ్లలో ప్రిన్స్ యావర్, ప్రశాంత్లు ఉండగా, అమర్, తేజలు సరిగా ఆడటం లేదని చెప్పింది. ఈ సందర్భంగా తేజ, యావర్, ప్రశాంత్ల ఫొటోలను చూపించి, ఎవరితో స్నేహం, డేట్, పెళ్లి చేసుకుంటావ్ అని అడగ్గా, తేజతో ఫ్రెండ్షిప్ చేస్తానని, యావర్తో డేట్కు వెళ్తానని, ప్రశాంత్ను పెళ్లి చేసుకుంటానని సరదాగా చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?