‘యాంకరింగ్ అనవసరంగా చేశాను’ : కౌశల్‌

సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది.

Published : 07 Dec 2020 17:58 IST

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కలిసి సుమ చేసే సందిడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. తాజాగా ఈ గేమ్ షోలో బిగ్‌బాస్‌ సీజన్‌-2 ద్వారా ప్రేక్షకులను అలరించిన కౌశల్, అమిత్‌, శ్యామల, పూజ రామచంద్రన్‌ పాల్గొని సందడి చేశారు. షోలో భాగంగా కౌశల్‌, శ్యామల వేసిన పంచులు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.

సుమ-కౌశల్-శ్యామల మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి. అలాగే షోలోని ఓ రౌండ్‌లో ‘మీరు పనిచేసినటువంటి దర్శకులలో ఎవరితో సౌకర్యవంతంగా అనిపించింది’ అని అమిత్‌ని సుమ ప్రశ్నించగా.. పూరిజగన్నాథ్‌ అన్న సమాధానంతో సుమ సరదాగా బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఆకట్టుకుంది. అలాగే ‘మోడలింగ్, యాంకరింగ్ ఈ రెండు వృత్తుల్లో అనవసరంగా ఇది చేశాను అని మీరు దేని గురించి బాధపడుతున్నారు’ అని కౌశల్ని ప్రశ్నించగా.. యాంకరింగ్ అంటూ చెప్పిన సమాధానంతో శ్యామల, కౌశల్ మధ్య సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ‘సుమ కన్ఫ్యూజన్‌ రూమ్’ అనే రౌండ్ ఆకట్టుకుంది. ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగే ఈ జోష్‌ఫుల్ ఎపిసోడ్‌ని వీక్షించాలంటే వచ్చే శనివారం(డిసెంబర్‌ 12)న ప్రసారం కానున్న ‘క్యాష్‌’ కార్యక్రమాన్ని చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను చూసేయండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని