Dhanush: రెండు భాగాలుగా ‘కెప్టన్‌ మిల్లర్‌’?

చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రాబోయే సినిమాలు రెండు భాగాల్లో రూపొందడం ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ‘కెప్టన్‌ మిల్లర్‌’ చిత్రం కూడా ఈ బాటలోనే పయనించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 15 Oct 2023 11:35 IST

చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రాబోయే సినిమాలు రెండు భాగాల్లో రూపొందడం ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ‘కెప్టన్‌ మిల్లర్‌’ చిత్రం కూడా ఈ బాటలోనే పయనించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైయ్యాయి. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. 1980కాలం నాటి కథల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబరు 15న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని