Parinayam: దుల్కర్‌, కల్యాణిల ఫీల్‌గుడ్ మలయాళ మూవీ ‘ఆహా’లో!

దుల్కర్‌ సల్మాన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘వరునె అవశ్యముంద్‌’.

Published : 18 Sep 2021 15:56 IST

హైదరాబాద్‌: దుల్కర్‌ సల్మాన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘వరునె అవశ్యముంద్‌’. అనూప్‌ సత్యన్‌ దర్శకుడు. గతేడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. సురేశ్‌గోపి, శోభన కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత సురేశ్‌ గోపి నటించడం, పైగా శోభనతో ఆయన 15ఏళ్ల తర్వాత కలిసి తెరను పంచుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ‘వరునె అవశ్యముంద్‌’ను ‘పరిణయం’ పేరుతో తీసుకువస్తోంది. సెప్టెంబరు 24నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అల్ఫాన్స్‌ జోసెఫ్‌ స్వరాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని