Dhanush: ముంబయిలో కుబేర

ధనుష్‌, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

Updated : 26 Apr 2024 11:46 IST

నుష్‌, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ధనుష్‌, రష్మికలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ ఘట్టాల్నీ చిత్రీకరిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్‌ కమ్ముల శైలి. ‘కుబేర’తో తనదైన శైలిలో ఫిలాసఫీ చెప్పబోతున్నారు.. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్‌ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరిస్తారు. ధనుష్‌, నాగార్జున, రష్మిక బలమైన పాత్రల్లో కనిపిస్తార’’ని సినీవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు