aa okkati adakku: పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఇది మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాజీవ్ గురువారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
- ‘‘సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతోనే నేనీ చిత్రసీమలోకి వచ్చాను. మా యానిమేషన్ సంస్థలో రూపొందించిన ‘ఛోటా భీమ్’ పెద్ద హిట్టయ్యాక మరో ఆరు యానిమేషన్ సినిమాలు చేశాం. అలా మా కంపెనీ పూర్తిగా స్థిరపడ్డాక నిర్మాతగా సినిమాల్లోకి రావాలనుకున్నా. కాకపోతే దీనికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఇక రెండేళ్ల క్రితం నిర్మాతగా తొలి అడుగు వేయాలనుకున్నప్పుడు మల్లి అంకం ఈ కథ చెప్పారు. పెళ్లి చుట్టూ తను అల్లుకున్న కథ నాకు బాగా నచ్చింది. వినోదం, భావోద్వేగాలతో పాటు అన్నిరకాల వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్నే మా తొలి చిత్రంగా పట్టాలెక్కించాం’’.
- ‘‘నాకు ఈ కథ విన్నప్పుడే ఇది అల్లరి నరేశ్కు సరిగ్గా సరిపోతుందనిపించింది. మేము ఈ స్క్రిప్ట్ వినిపించే సమయానికి ఆయన మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నా.. తన కోసం వేచి చూసి ఈ చిత్రం చేశాం. దీనికి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్ను సూచించింది అల్లరి నరేశే. సినిమాలో ఆయన్ని పెళ్లి ఎప్పుడని అడిగినప్పుడల్లా తను చిరాకుతో చెప్పే డైలాగ్ ఇది. నరేశ్ నాన్నగారి క్లాసిక్ సినిమా టైటిల్ను దీనికి పెట్టడం వల్ల మాపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందని నమ్మకం కలిగాకే ఆ పేరును ఈ చిత్రానికి ఖరారు చేశాం’’.
- ‘‘ఈరోజుల్లో జీవితంలో స్థిరపడటం కంటే పెళ్లి అవ్వడమనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిత్రంలో హీరోది కూడా అదే సమస్య. సబ్ రిజిస్ట్రార్గా తన చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించిన అతనికి 35ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మరి తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలేంటి? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అన్నది వినోదాత్మకంగా చూపించాం. ఇది ఈతరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్లు ఉన్నాయి. స్క్రీన్ప్లే ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేస్తుంది’’.
- ‘‘ప్రస్తుతం మేము ‘ఛోటా భీమ్’ను పిల్లలతో రియల్ యానిమేషన్ పద్ధతిలో చేస్తున్నాం. డిస్నీలో ఒక యానిమేషన్ షో ప్రారంభించనున్నాం. అలాగే ప్రభాస్ ‘కల్కి 2898ఎ.డి’ చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ యానిమేషన్ కాన్సెప్ట్ను సిద్ధం చేస్తున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్