Etvwin: ఈటీవీ విన్‌లో ఒకే రోజు రెండు సినిమాలు

ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి

Updated : 09 May 2024 10:06 IST

ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వరుణ్‌సందేశ్‌, ధన్‌రాజ్‌, కాశీ విశ్వనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిత్రం చూడర’. సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కి వస్తారు ఓ ముగ్గురు వ్యక్తులు. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఓ పోలీసు అధికారి వాళ్లని ఓ దొంగతనం కేసులో ఇరికిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వాళ్లు ఎలా బయటపడ్డారు? నటులు కావాలనే కలను నెరవేర్చుకున్నారా? అనే విషయాలు సినిమాలోనే చూడాలి. ఆర్‌.ఎన్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోయపాటి భాగ్యలక్ష్మి, శేషు మారమ్‌ రెడ్డి నిర్మించారు.

తంగదురై, సనమ్‌ శెట్టి, సాయి రాజ్‌కుమార్‌, గజరాజ్‌, జయకుమార్‌, అరుల్‌ డి శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పార్ధు’. అర్జునన్‌ ఏకలవ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఓ ప్రైవేటు ఇన్‌వెస్టిగేటర్‌ వద్ద పనిచేసే ఓ వ్యక్తి కొత్త దారిలో వెళ్లానుకొని ఉద్యోగాన్ని కోల్పోతాడు. తర్వాత ఏమైంది? అనేది ‘పార్ధు’ అసలు కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని