Cinema News: కొత్త అందాల... సరికొత్త ఆశలు
కొత్త సినీ క్యాలెండర్ తెరచుకుందంటే చాలు.. అగ్ర తారల సందడి ఎలా ఉండనుంది? స్టార్ నాయికల జోరు ఎలా సాగనుంది? యువ హీరోల వేగం ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు మొదలైపోతాయి. ఇక కొత్త అందాలు తెరపై వచ్చి వాలనున్నాయని తెలిస్తే చాలు..
కొత్త సినీ క్యాలెండర్ తెరచుకుందంటే చాలు.. అగ్ర తారల సందడి ఎలా ఉండనుంది? స్టార్ నాయికల జోరు ఎలా సాగనుంది? యువ హీరోల వేగం ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు మొదలైపోతాయి. ఇక కొత్త అందాలు తెరపై వచ్చి వాలనున్నాయని తెలిస్తే చాలు.. సినీప్రియుల దృష్టంతా ఆవైపే వెళ్లిపోతుంది. కొత్త ఏడాదిలో మురిపించే ఆ తారలెవరు? వారి సినిమాల విశేషాలేమిటీ? అంటూ ఆరాలు తీస్తుంటారు. 2022లో తెలుగు తెరపై కాలుమోపుతున్న కొత్త అందాల జాబితా పెద్దగానే ఉంది. ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసి వినోదాలు పంచడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు.. ప్రస్తుతం చిత్రీకరణల్లో బిజీగా ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి ఈ ఏడాదిలో తెలుగు తెరపై సందడి చేయనున్న ఆ కొత్త తారకలు ఎవరు?.
కొత్తదనానికి.. కొత్త అందాలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకడంలో ముందుంటుంది తెలుగు చిత్రసీమ. అందుకే ఏటా పదుల సంఖ్యలో కొత్త వారు అదృష్టం పరీక్షించుకుంటుంటారు. ఈ సారి వీరి సంఖ్య రెట్టింపుగా ఉంది. అందం.. అభినయాలతో ఇటు తమిళం అటు మలయాళంలో స్టార్ నాయికగా మెరుపులు మెరిపిస్తోంది నజ్రియా ఫహాద్. ఇప్పుడీ అమ్మడు తొలిసారి తెలుగు తెరపై సందడి చేయనుంది. ప్రస్తుతం నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాని సరసన నాయికగా ఆడిపాడుతోంది నజ్రియా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు మినహా మిగిలిన దక్షిణాది భాషల్లో స్టార్ నాయికగా సత్తా చాటుతోన్న మరో మలయాళీ అందం సంయుక్తా మేనన్. ఇప్పుడీ సొగసరి ‘భీమ్లానాయక్’తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ప్లే రాస్తున్నారు. ఇందులో రానాకు జోడీగానే సందడి చేస్తోంది సంయుక్తా. ఫిబ్రవరి 25న విడుదల కానుంది. సంయుక్త ప్రస్తుతం ధనుష్కు జోడీగా ‘సార్’ అనే ద్విభాషా సినిమాలో నటిస్తోంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
* మోడల్గా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి.. అందరి దృష్టినీ ఆకర్షించిన భామ సాక్షి వైద్య. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ‘ఏజెంట్’తో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది. అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా కోసమే తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు అఖిల్. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
* నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు చిరునామాగా నిలుస్తూ.. మలయాళంలో స్టార్ నాయికగా జోరు చూపిస్తోంది నటి రాజీషా విజయన్. సూర్య నటించిన ‘జైభీమ్’లో మిత్రగా కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘రామారావు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనుంది. శరత్ మండవా తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. మార్చి 25న విడుదల కానుంది.
మురిపించడమే తరువాయి...
తెలుగులో ఇప్పటికే తొలి సినిమా పూర్తి చేసి.. ప్రేక్షకుల్ని పలకరించేందుకు ఎదురు చూస్తున్న భామలు చాలా మందే ఉన్నారు. ఈపాటికే వెండితెరపై సందడి చేయాల్సిన వారి చిత్రాలు కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. బాలీవుడ్ నాయిక అలియా భట్, విదేశీ అందం ఒలీవియా మోరిస్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ సినిమా... కరోనా పరిస్థితుల వల్ల మరోసారి వాయిదా పడింది. ‘దబాంగ్ 3’తో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన కొత్త సొగసరి సయీ మంజ్రేకర్. ప్రస్తుతం తెలుగులో ‘గని’, ‘మేజర్’ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఈ రెండూ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మరి వీటిలో మొదటగా ఏ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తుందో తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!