Tollywood: తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా..
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. ఎక్కడ సినిమా తీసినా దేశమంతా ఆడించేసుకోవచ్చన్న భరోసా అందరిలోనూ ఏర్పడిపోయింది. అందుకే ప్రస్తుతం మన తెలుగు దర్శకులు మిగిలిన భాషల్లో మెరుపులు మెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పలువురు యువ దర్శకులు ఆశ్చర్యపరిచే కలయికలతో బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఉత్తరాదిలో జెండా పాతేందుకు సిద్ధమవుతున్న ఆ తెలుగు కెప్టెన్లు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? చూసేద్దాం పదండి..
మన తెలుగు దర్శకులు బాలీవుడ్ తారలతో కలిసి వెండితెరపై ప్రతాపం చూపించడమన్నది కొత్త పరిణామమేమీ కాదు. కాకపోతే ఇటీవల కాలంలో ఈ తరహా కలయికల జోరు పెరిగింది. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తొలి అడుగులోనే తెలుగులో సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్లోనూ జోరు చూపించారు. షాహిద్ కపూర్తో ‘కబీర్ సింగ్’, రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమాలు చేసి వరుస విజయాలందుకున్నారు. ఆ బాటలోనే ‘జెర్సీ’ రీమేక్తో గౌతమ్ తిన్ననూరి, ‘హిట్’ రీమేక్తో శైలేష్ కొలను, ‘ఛత్రపతి’ రీమేక్తో వి.వి.వినాయక్ బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ, వారి ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఇప్పుడు మరికొందరు తెలుగు దర్శకులు బాలీవుడ్లో తొలి అడుగులు వేసేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
రణ్వీర్ - ప్రశాంత్ కలయికలో..
వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు ప్రశాంత్ వర్మ. ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన.. ‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో ఓ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్వీర్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ప్రశాంత్ దీంతోపాటు ‘హను-మాన్’కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ సినిమా చేయనున్నారు.
సన్నీ దేవోల్తో యాక్షన్ డ్రామా..
కొత్తదనం నిండిన మాస్ యాక్షన్ కథలతో సినీప్రియుల్ని మెప్పించడంలో ముందుంటారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరుస విజయాలందుకుని జోరుమీదున్న ఆయన ఇప్పుడు హిందీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ‘గదర్ 2’తో హిట్టు కొట్టి జోరుమీదున్న సీనియర్ హీరో సన్నీ దేవోల్తో ఓ సినిమా చేయనున్నారు. ఇదీ గోపీచంద్ శైలి యాక్షన్ డ్రామా కథాంశంతోనే తెరకెక్కనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
వంశీతో షాహిద్?
‘మహర్షి’ విజయం తర్వాత తమిళ స్టార్ విజయ్తో కలిసి ‘వారసుడు’ సినిమా చేసి సత్తా చాటారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పుడాయన బాలీవుడ్లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తను ఇప్పటికే షాహిద్ కపూర్కు ఓ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. తెలుగు సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసే గోల్డ్మైన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో తెలుగు చిత్రసీమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఈ ఏడాదిలోనే పట్టాలెక్కనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
‘బేబి’..హిందీలోకి!
చిన్న చిత్రంగా విడుదలై.. గతేడాది బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘బేబి’ ఒకటి. విభిన్నమైన కల్ట్ ప్రేమకథతో సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ సినిమా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్లో పునర్నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలోనూ సాయి రాజేశే తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్కేఎన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రంతో ఓ స్టార్ కిడ్ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. -
పేరు అదేనా?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజైన ఆ రోజున చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి. -
సూర్యకు జోడీగా పూజ?
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. -
‘ధురంధర్’.. గ్యాంగ్స్టర్
సంగ్రామ్ భలేరావ్గా ‘సింగమ్ అగైన్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. రణ్వీర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
ప్రేమ యుద్ధానికి సన్నాహాలు
‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, అలియా భట్. ఇప్పుడు మరోసారి ‘లవ్ అండ్ వార్’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట. -
అందర్నీ అలరించే యాక్షన్ చిత్రమిది
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మనం’ ప్రత్యేక ప్రదర్శనలు
మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్ చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. -
‘కన్నప్ప’లో కాజల్
విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ దర్శకురాలి చిత్రంలో జాకీ ష్రాఫ్
ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్ బొన్నైర్ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు