రవితేజకు మైలురాయి చిత్రం టైగర్ నాగేశ్వరరావు
‘‘టైగర్ నాగేశ్వరరావు’లో ఊహకు అందని కొన్ని విషయాలున్నాయి. ఇందులో పోరాట ఘట్టాల్ని చాలా వాస్తవికంగా తీర్చిదిద్దాం. వాటిని ప్రేక్షకులు నిజమైన పోరాటాలుగా అనుభూతి చెందుతారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్.
‘‘టైగర్ నాగేశ్వరరావు’లో ఊహకు అందని కొన్ని విషయాలున్నాయి. ఇందులో పోరాట ఘట్టాల్ని చాలా వాస్తవికంగా తీర్చిదిద్దాం. వాటిని ప్రేక్షకులు నిజమైన పోరాటాలుగా అనుభూతి చెందుతారు’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్. రవితేజ కథానాయకుడిగా వంశీ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానున్న నేపథ్యంలో.. వారిద్దరూ హైదరాబాద్లో సోమవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘‘ఈ కథ మాకు కొంచెం బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే మేము స్టువర్టుపురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చిన్నప్పుడు ఊర్లో కథలు కథలుగా విన్నాం. ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తే వారని.. ఇలా చాలా ఊహకందని ఆసక్తికర విషయాలు వినేవాళ్లం. అందరికీ చెప్పి.. దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఓ పాత్రని చూస్తున్నప్పుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. నాగేశ్వరరావు చెన్నై జైలు నుంచి తప్పించుకున్నారు. ఆయనకు టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారట. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మేము ఒక ఫైట్ తీసేటప్పుడు రోప్ కడతాం. బోలెడు ఏర్పాట్లు చేస్తాం. కానీ, టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు.. అంత శక్తి ఎక్కడ నుంచి వచ్చిందన్నది ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక దొంగ అంత ప్రాచుర్యం పొందాడంటే దాని వెనుక ఏదోక ప్రత్యేకత ఉంటుంది.
కొత్త అనుభూతినిచ్చింది..
‘‘రవితేజతో మేము ఎన్నో చిత్రాలకు పని చేశాం. కానీ, ఈ సినిమా మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ చాలా బాగా సరిపోయారు. ఈ కథకు అన్నీ బాగా కుదిరాయి. ఇందులోని ప్రతి యాక్షన్ ఎపిసోడ్ను ప్రేక్షకులు రియల్గా ఫీలవుతారు. వాటిని నాగేశ్వరరావు నివసించిన చీరాల ప్రాంతంలోని జీడి తోటల్లోనే షూట్ చేశాం. ఆ ఫైట్స్ కోసం రవితేజ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే రైలు యాక్షన్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంత పవర్ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి కృతజ్ఞతలు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా స్థాయికి వెళ్లనున్నారు. ఆయనకు ఇది ఒక మైలురాయి అవుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?