Sree Vishnu: హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌తో!

‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్‌ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్‌ షా కిరణ్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 18 Apr 2024 12:01 IST

‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్‌ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్‌ షా కిరణ్‌ తెరకెక్కిస్తున్నారు. సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇదొక ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో అయ్యప్ప శర్మ, వీర్‌ ఆర్యన్‌, సుదర్శన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందిస్తున్నారు. విద్యాసాగర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని