aa okkati adakku: పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం.
‘‘పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. రాజీవ్ చిలక నిర్మాత. ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు మల్లి అంకం.
‘‘పెళ్లెప్పుడు అని తేలిగ్గా అడిగేస్తుంటాం కానీ... ఆ మాట పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవాళ్లకీ, వాళ్ల కుటుంబాలకీ చాలా సార్లు ఎంతో బాధని కలిగిస్తుంది. దాని వెనక భావోద్వేగాల్ని ఆవిష్కరించాలనే ప్రయత్నమే ఈ సినిమా. దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలోని కామెడీ, భావోద్వేగాలు మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. నరేశ్కి నేను కథ మాత్రమే చెప్పా. విన్నాక ఆయనే ఈ పేరుని సూచించారు. కథకి దగ్గరైన పేరు ఇది. ఆ పేరుతో ఈవీవీ సర్ తీసిన సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉంది. అలాంటి పేరుతో మేం సినిమా చేయడం నాపై మరింత బాధ్యతని పెంచింది’’.
- ‘‘నరేశ్ కొంతకాలంగా కామెడీ సినిమాలు చేయడం లేదు. దాంతో నేను కామెడీ కథ అనగానే ఆయన మొదట అయిష్టత వ్యక్తం చేశారు. ఆయన ఇదివరకు చేసిన స్లాప్స్టిక్ కామెడీ అనుకున్నారు. కానీ ఇందులోని భావోద్వేగాల గురించి తెలుసుకుని కథ వినడం మొదలుపెట్టారు. సగం కథ చెప్పడం పూర్తవ్వగానే ‘ఇది మనం చేద్దాం’ అన్నారు’.
- ‘‘సమాజంలో జరిగే సంఘటనలే ఈ కథకి స్ఫూర్తి. వాటికి కొన్ని కల్పితాల్ని జోడించి ఈ కథ రాసుకున్నా. పూర్వ విద్యార్థుల కలయిక పేరుతో మా స్నేహితులంతా ఓసారి కలిశాం. కొంతమంది కుటుంబాలతో కలిసి వస్తే, కొంతమందికేమో పెళ్లి కాలేదు. అందరూ వేదికనెక్కితే, పెళ్లి కాని ఒకరిద్దరు మాత్రం వేదికపైకి రావడానికీ ఇష్టపడలేదు. వస్తే పెళ్లి కాలేదనే విషయం అందరికీ తెలుస్తుందనీ, ఆ తర్వాత పెళ్లి ఎందుకు చేసుకోలేదని, ఎప్పుడు చేసుకుంటావని అడుగుతారనీ ఈ సమాధానాలు చెప్పలేకే రానని చెప్పారు వాళ్లు. ఆ సందర్భంలో వాళ్ల ఆవేదన ఎలాంటిదో నాకు అర్థమైంది. అలాగే పెళ్లి సంబంధాల్ని చూసే మ్యాట్రిమోనీ ఏజెన్సీల గురించి, పెళ్లికి సంబంధించి పత్రికల్లో వచ్చిన మరికొన్ని సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశా. రచయిత అబ్బూరి రవి ఈ కథలోని భావోద్వేగాన్ని మరింత బలంగా ఆవిష్కరిస్తూ మాటలు రాశారు. ఆయన ఈ సినిమాకి ఎంతో బలం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు నుంచి ఆరంభం
‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
నేనేంటో నిరూపించుకోవడమే ముఖ్యం
‘‘కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. -
సంగీత పరిణామం... మనోహర ప్రయాణం
సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్. రెహమాన్ ఒకరు. -
ఈసారీ వర్షం పడింది.. విజయమే
‘గం.. గం.. గణేశా’తో థియేటర్లలో సందడి చేయనున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్ శెట్టి తెరకెక్కించారు. -
దీపావళికి కంగువా..?
మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు. -
వివాదంలో పాయల్ రాజ్పూత్
నటి పాయల్ రాజ్పూత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్) అనే చిత్రంలో నటించింది. -
పాత్ర కోసం నిజమైన బంగారం
భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ మిరాయ్
మంచు మనోజ్ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
నటి పాయల్ రాజ్పుత్ సోషల్మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.