God Father: ‘గాడ్ ఫాదర్’ వసూళ్లు.. వారికి సమాధానం చెప్పాలంటే రోజు చాలదు: ఎన్వీ ప్రసాద్
‘గాడ్ ఫాదర్’ వసూళ్ల గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పందించారు. కలెక్షన్ల విషయంలో తామంతా సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్: ‘గాడ్ ఫాదర్’ (God Father) వసూళ్ల గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ (NV Prasad) స్పందించారు. కలెక్షన్ల విషయంలో తామంతా సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) తెరకెక్కించిన చిత్రమిది. దసరా కానుకగా విడుదలై సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్, నటుడు సత్యదేవ్ (Satyadev), దర్శకుడు మోహన్రాజా, సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) విలేకరుల సమావేశంలో పాల్గొని, పలు విశేషాలు పంచుకున్నారు.
* మీరే సొంతంగా సినిమాను విడుదల చేయటానికి కారణమేంటి?
ఎన్వీ ప్రసాద్: ఈ సినిమా ప్రారంభంలోనే నాకు హిట్ కావాలని, దాని కోసం ఎంతైనా చేస్తానని దర్శకుడు మోహన్రాజాకు చెప్పా. అనుకున్న ఫలితం వచ్చింది. క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాని తీయలేదు. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచీ వర్షం పడుతోంది అయినా మేం ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
* ‘ఆచార్య’ తర్వాత ఈ సినిమాని తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారు?
ఎన్వీ ప్రసాద్: మేం ‘ఆచార్య’ను దృష్టిలో పెట్టుకోలేదు. చిత్ర పరిశ్రమలో జయపజయాలు సహజం. ఏ విషయంలో ఫెయిల్ అయ్యామో విశ్లేషించుకుని ముందుకెళ్లాలి. ఫ్లాప్ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మన చిత్ర పరిశ్రమ ఇంత అభివృద్ధి చెంది ఉండేది కాదు.
* మీరు ప్రకటించిన వసూళ్లలో నిజం లేదని ట్రోల్స్ వస్తున్నాయి..?
ఎన్వీ ప్రసాద్: సోషల్ మీడియాలో మాపై మొదటి నుంచీ ట్రోల్స్ వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పాలంటే ఈరోజు సరిపోదు. ఈ సినిమాకి ప్రచారం కూడా సరిగా చేయలేదన్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్నా మేం పనిచేస్తూనే ఉన్నాం. మా కష్టం వారికి తెలియదు కదా. మాకొచ్చిన రెవెన్యూకు మేం సంతృప్తిగా ఉన్నాం. ఓవర్సీన్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఈ సినిమా (లూసీఫర్) ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినా థియేటర్లలో ప్రదర్శితమవుతుందంటే దానికి కారణం మేం చేసిన మార్పులు. ఓటీటీలో ఉచితంగా లభించే సినిమాను డబ్బులిచ్చి థియేటర్లలో చూశారంటే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతోంది. ఓటీటీలో ఉన్న సినిమాను తెరకెక్కించటమంటే మామాలు విషయం కాదు. అదొక ఛాలెంజ్.
* మాతృకలో ఉన్న హీరో సోదరుడి పాత్రను ‘గాడ్ ఫాదర్’లో ఎందుకు పెట్టలేదు?
మోహన్రాజా: మాతృక సినిమాలో హీరో మోహన్లాల్ 53 నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆ వెర్షన్కు అది కరెక్ట్. కానీ, మన దగ్గర హీరోలకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కమర్షియల్ కోణంలోనూ దోహదపడుతుంది. ఆ ఉద్దేశంతోనే హీరో సోదరుడి పాత్రను తొలగించి, చిరంజీవి క్యారెక్టర్ నిడివి పెంచాం.
* ఈ సినిమాని రీమేక్ చేయటం ఎలా అనిపించింది?
మోహన్రాజా: నా కెరీర్లో నేను తెరకెక్కించిన 10 చిత్రాల్లో 8 రీమేక్లు. ‘హనుమాన్ జంక్షన్’ అనేది మలయాళ సినిమా (తెన్కాశీపట్టణం) రీమేక్ అని చాలామందికి తెలియదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రీమేక్ల గురించి ముందే తెలియటంతో.. ‘అందరూ చూసిన సినిమాను మళ్లీ ఎందుకు తీస్తున్నారు’ అని చాలామంది కామెంట్ చేశారు. దాన్ని సవాలుగా స్వీకరించి ఈ చిత్రాన్ని తీశాం. ‘లూసీఫర్’ను నేను కథలా కాదు ఓ ఐడియాలా చూశా. అందులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కంటెంట్ చాలా ఉంది. మాతృకను క్లాస్గా చూపించారు. మనం మాస్గా రూపొందించాం. చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ప్లే రాశాం.
* తదుపరి ఎవరితో సినిమా చేస్తున్నారు?
మోహన్రాజా: దాని గురించి ఇప్పుడు చెప్పలేను. త్వరలో తెలియజేస్తా.
* చిరంజీవికి దీటుగా నటించారన్న ప్రశంసలు అందుకున్నారు. ఆ నటనకు కారణం ఎవరు?
సత్యదేవ్: నేను అలా నటించటానికి కారణం చిరంజీవి అన్నయ్య. ఈ సినిమా హిట్ అవుతుందని, నేను మరింత ఎక్కువమందికి తెలుస్తానని అన్నయ్య ఎప్పుడో చెప్పారు.
* ఈ సినిమా నేపథ్య సంగీతానికి ఎంత సమయం తీసుకున్నారు?
తమన్: 29 రోజుల్లో ఈ సినిమా బీజీఎం పూర్తి చేశా. సినిమా చిత్రీకరణ పూర్తవక ముందు ఓ పాటను రూపొందించా. సినిమా పూర్తయ్యాక మిగిలిన పాటలు కంపోజ్ చేశా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే?
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?