Naresh: మారేడుమిల్లిలో పోరాటం

‘నాంది’ విజయం తర్వాత అల్లరి నరేష్‌ నుంచి రానున్న కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ రాజమోహన్‌ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆనంది

Updated : 11 May 2022 08:12 IST

‘నాంది’ విజయం తర్వాత అల్లరి నరేష్‌ నుంచి రానున్న కొత్త చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్‌ రాజమోహన్‌ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆనంది కథానాయిక. నరేష్‌ సినీ ప్రయాణం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో భుజాన మంచం పెట్టుకుని.. ఒంటి నిండా గాయాలతో నరేష్‌ ఆసక్తికరంగా కనిపించారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇదీ ‘నాంది’ తరహాలోనే సీరియస్‌గా సాగే కథతో రూపొందుతోందని అర్థమవుతోంది. ఇది తనకు 59వ సినిమా. ఇందులో ఆయన మారేడుమిల్లి గిరిజనుల కోసం పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని