Lata Mangeshkar: పాటల ‘రీమిక్స్’పై లతా మంగేష్కర్ ఏమనేవారంటే..!
గతంలో లతా మంగేష్కర్ పాడిన పాపులర్ పాటలను రీమిక్స్ చేసి అనంతర కాలంలో వచ్చిన సినిమాలు, వీడియోల్లో ఉపయోగించారు. ఇటువంటి రీమిక్స్ పద్ధతిని మాత్రం లతా మంగేష్కర్ వ్యతిరేకించేవారు.
దిల్లీ: భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం యావత్ సంగీత ప్రియులకు చేదు వార్తగానే మిగిలిపోయింది. భౌతికంగా లతా మంగేష్కర్ అందర్నీ వీడిపోయినప్పటికీ.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో మధుర గీతాలను మాత్రం ప్రపంచానికి అందించారు. దాదాపు ఏడు దాశాబ్దాల పాటు కొనసాగిన ఆమె వృత్తి జీవితంలో ఎన్నో వేల ఆణిముత్యాలను అందించారు. అయితే, గతంలో లతా మంగేష్కర్ పాడిన పాపులర్ పాటలను రీమిక్స్ చేసి అనంతర కాలంలో వచ్చిన సినిమాలు, వీడియోల్లో ఉపయోగించారు. ఇటువంటి రీమిక్స్ పద్ధతిని మాత్రం లతా మంగేష్కర్ వ్యతిరేకించేవారు. గతంలో ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. పాటల రీమిక్స్కు సంబంధించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ 2018లో ఓ ప్రకటన విడుదల చేశారు.
హిందీ పాటల్లో రీమిక్స్కు సంబంధించిన అంశం ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్తో జరిపిన సంభాషణ సమయంలో ప్రస్తావనకు వచ్చింది. అనంతరం ఆ విషయంపై తన అభిప్రాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ 2018లో లతా మంగేష్కర్ ఓ ట్వీట్ చేశారు. ‘ఆనాటి మధుర గీతాలకు కొత్త సంగీత బాణీలను జోడించి నూతనంగా తీసుకొచ్చే ముందు రికార్డింగ్ కంపెనీలు ఓసారి ఆలోచించాలి. సిద్ధాంతపరంగా పాటలను రీమిక్స్ చేయడం తప్పేమీ కాదు. ఒక పాట సారాంశం, సాహిత్యం సురక్షితంగా ఉన్నంతకాలం దానిని కొత్త వర్షన్లో తీసుకురావడంలో తప్పేమీ లేదు. కానీ, పాటకు ఓ కచ్చితమైన రూపం లేకుండా దాని ఆకృతిని మాత్రమే మార్చడం తప్పు’ అంటూ అతా మంగేష్కర్ పేర్కొన్నారు.
ఇక పాట క్రెడిట్ను మరొకరికి ఇచ్చేందుకు ట్యూన్ని పాడుచేయడం, సాహిత్యాన్ని యథేచ్ఛగా మార్చడం వంటి చౌకబారు ఆలోచనలు జోడించడం చోటు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని లతా మంగేష్కర్ పేర్కొన్నారు. ఇటువంటి అసంబద్ధ ప్రవర్తన తనను ఎంతోగానో బాధిస్తోందంటూ అప్పట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు స్వరకర్తలు, గాయకులు, గీత రచయితలు, సాంకేతిక బృందం, దర్శకులు ఎంతో కష్టపడతారని వివరించారు. ఇటువంటి సంగీత వారసత్వం అక్కడితో ఆగకూడదని.. మన సమాజం, సంస్కృతికి ఓ ముఖ్యమైన చిహ్నంగా సంగీతాన్ని గౌరవించే స్థాయికి ఎదగాలని లతా మంగేష్కర్ ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా