Cinema News: ‘కడువా’.. వారం ఆలస్యంగా

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’. సుప్రియా మేనన్‌, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను జూన్‌ 30న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇ

Updated : 29 Jun 2022 09:21 IST

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva). సుప్రియా మేనన్‌, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను జూన్‌ 30న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘‘అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వల్ల ‘కడువా’ను జులై 7కి వాయిదా వేశాం. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగిస్తాం. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు మీ అందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి’’ అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, ఛాయాగ్రహణం: అభినందన్‌ రామానుజం.

మగాళ్లలో మార్పు తెచ్చే ‘ఫిమేల్‌’

శుభాంగి తంభాలే ప్రధాన పాత్రలో నాని తిక్కిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘ఫిమేల్‌’ (Female). వెలిచర్ల ప్రదీప్‌ రెడ్డి నిర్మాత. దీపిక, తమన్నా సింహాద్రి, బేబీ దీవెన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని, మగాళ్లలో మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సంగీతం: వంశీకాంత్‌ రేఖన, కూర్పు: క్రాంతి, ఛాయాగ్రహణం: జగదీష్‌ కొమరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని