Meenakshi Chaudhary: పడ్డాను.. ప్రయత్నించాను..: మీనాక్షి ఆసక్తికర పోస్ట్‌

నటి మీనాక్షి చౌదరీ (Meenakshi Chaudhary) తాజాగా షేర్‌ చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Published : 06 Sep 2023 20:02 IST

హైదరాబాద్‌: ‘గుంటూరు కారం’(Guntur Kaaram)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. కష్టం, లేదా సుఖం.. పరిస్థితి ఏదైనా సరే చిరునవ్వుతో ముందు సాగాలని ఆమె పేర్కొన్నారు.

‘‘మీనాక్షిలోని అనేక షేడ్స్‌!! గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో భావోద్వేగాలతో నా జీవితం ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగింది. ఇలాంటి దశలను ఇంతకు ముందెప్పుడూ అనుభూతి చెందలేదు. కిందపడ్డా, ప్రయత్నించా, మళ్లీ తిరిగి లేచా.. ఇలా నా జీవితం సాగింది. ఆత్మపరిశీలనతో జీవితాన్ని చూసే విధానం మారింది. ఇక, ప్రతి దశలోనూ ఈ చిరునవ్వు నాకు తోడుగా ఉంది. కాలంతోపాటు పరిస్థితులు కూడా మారతాయనే విషయాన్ని అదే నాకు అర్థమయ్యేలా చేసింది. కాబట్టి, జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే.. చిరునవ్వు చిందించిన క్షణాలు గుర్తు చేసుకోండి’’ అని ఆమె రాసుకొచ్చారు. ఇటీవల తన జీవితంలోని పలు దశలకు సంబంధించిన ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇందులోని ప్రతి ఫొటోలో మీనాక్షి నవ్వుతూ కనిపించారు.

Kausalya: ఇష్టం లేక కాదు కానీ..: పెళ్లిపై నటి కీలక వ్యాఖ్యలు

హరియాణాకు చెందిన మీనాక్షి 2018లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆమె రన్నరప్‌గా నిలిచారు. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’తో ప్రేక్షకులను అలరించారు. మీనాక్షి ప్రస్తుతం ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఇది తెరకెక్కుతోంది. దీనితోపాటు ఆమె విశ్వక్‌సేన్‌, వరుణ్‌తేజ్‌తో సినిమాలు ఓకే చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని