Cinema News: అంతా మనమే... ఇక నా మాటే
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా సంగీత ప్రచార కార్యక్రమం షురూ అవుతోంది. ‘ఇక నా మాటే...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. కుటుంబ వినోదంతో కూడిన విభిన్నమైన కథా చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్.వి.ఎస్, కూర్పు: ప్రవీణ్ పూడి, కళ: జానీ షేక్. సంభాషణలు: అర్జున్ కార్తీక్, ఠాగూర్, వెంకీ.
ఆస్కార్ ఉత్తమ నటుడి కొత్త చిత్రం
హాలీవుడ్ కథానాయకుడు సిలియన్ మర్ఫీ గతేడాది విడుదలైన ‘ఓపెన్ హైమర్’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన నటనతో ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచి ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన మరో వైవిధ్యమైన కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ‘బ్లడ్ రన్స్ కోల్’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్క్ ఏ బ్రాడ్లీ రచించిన ‘‘బ్లడ్ రన్స్ కోల్: ది యబ్లోన్స్కీ మర్డర్స్ అండ్ ది బాటిల్ ఫర్ ది యునైటెడ్ మైన్ వర్కర్స్ ఆఫ్ అమెరికా’ అనే పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. అమెరికన్ కార్మిక సంఘాల చరిత్రను మార్చిన కార్మిక సంఘాల ఆర్గనైజర్ జోసెఫ్ జాక్ యబ్లోన్స్కీ హత్య నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జెజ్ బటర్ వర్త్, జాన్ హెన్రీ బటర్ వర్త్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. జాన్ డేవిస్, జోర్డాన్ డేవిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘28డేస్ లాటర్ 2’ కోసం సిద్ధమవుతున్నారు సిలియన్ మర్ఫీ.
దుల్కర్ కాదు శింబు?
కమల్హాసన్ - మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఇందులో కనిపించే తారలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో కాల్షీట్ల సమస్య ఉత్పన్నం అవుతోంది. దాంతో తారాగణం విషయంలో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నట్టు సమాచారం. ఇందులో యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే ఆయన తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉత్పన్నమైనట్టు సమాచారం. ఆ స్థానాన్ని తమిళ కథానాయకుడు శింబుతో భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోని కీలక పాత్రల కోసం కథానాయకులు జయం రవి, గౌతమ్ కార్తీక్ ఎంపికైన విషయం తెలిసిందే.
‘క్రిష్ 4’ సన్నాహాలు
హృతిక్ రోషన్ సూపర్ హీరోగా నటించిన ‘క్రిష్’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. వీటికి సీక్వెల్గా 2024 చివర్లో ‘క్రిష్ 4’ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ‘మొదటి భాగాలకన్నా ఈ సినిమా మరింత భారీగా, సాహసాలమయంగా ఉంటుంది. సరైన కథ కోసం పలువురు రచయితలతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దానికోసం మా క్రియేటివ్ బృందం రాత్రింబవళ్లు పని చేస్తోంది. 2024 ఆఖర్లో ఈ ప్రాజెక్టు పూర్వ నిర్మాణ పనులు మొదలవుతాయి. 2025 ప్రథమార్ధంలో చిత్రీకరణని ప్రారంభిస్తాం. దీనికోసం హృతిక్ రోషన్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని మంగళవారం దర్శకుడు రాకేశ్ రోషన్ సన్నిహితవర్గాలు తెలిపాయి. హృతిక్ ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం