NTR: జపాన్‌లో భూకంపంపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

గత వారమంతా జపాన్‌లోనే గడిపి ఇంటికి తిరిగొచ్చానని... ఇంతలోనే అక్కడ భూకంపాలు సంభవించాయని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌.

Updated : 03 Jan 2024 11:52 IST

త వారమంతా జపాన్‌లోనే గడిపి ఇంటికి తిరిగొచ్చానని... ఇంతలోనే అక్కడ భూకంపాలు సంభవించాయని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. భూకంపాలతో ప్రభావితమైన ప్రజలు త్వరగా కోలుకోవాలని, వాళ్ల చుట్టూనే నా ఆలోచనలు ఉన్నాయని ఆయన ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొన్నారు. కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని గత వారమే ఆయన కుటుంబంతో కలిసి జపాన్‌ వెళ్లారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. బాధిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్య చేశారు.

ప్రత్యేక స్థానం:  జపాన్‌ భూకంపాల గురించి తెలిసి ఎంతో కలవరానికి గురయ్యానన్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. ఆయన ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ... ‘‘మన హృదయాల్లో జపాన్‌ దేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నా ఆలోచనలు భూకంపాలతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి చుట్టూనే తిరుగుతున్నాయి’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని