పూరి మాట: మనలో మనం మాట్లాడుకుందాం!
ప్రపంచం నిన్నొదిలేస్తే... ఒంటరితనం... నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే.. ఏకాంతం! ఈ మాట చాలా మంది మనకు చెప్పి ఉంటారు. కానీ ఇలాంటి జీవితానికి పనికొచ్చే మాటలు పూరి జగన్నాథ్ నోట వింటే ఓ కిక్ వస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం నిన్నొదిలేస్తే... ఒంటరితనం... నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే.. ఏకాంతం! ఈ మాట చాలా మంది మనకు చెప్పి ఉంటారు. కానీ ఇలాంటి జీవితానికి పనికొచ్చే మాటలు పూరి జగన్నాథ్ నోట వింటే ఓ కిక్ వస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు మనలో మనం మాట్లాడుకోవాలి అని పూరి అంటున్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో ఈ రోజు బూస్టింగ్ డోస్ రిలీజ్ చేశారు. అందులో ఆయనేం చెప్పారో మీరే చదవండి.
‘‘లోన్లీనెస్కి, ఎలోన్నెస్కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవ్వొద్దు. నీరసం వస్తుంది... ఏడుపొస్తుంది... మన మీద మనకే నమ్మకం పోతుంది. జీవితంలో ఒకటి రెండుసార్లు నేనూ ఇలానే ఫీల్ అయ్యాను. దాని నుంచి బయటకు రావడం తెలియకపోతే ఇంకా కూరుకుపోతాం. ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మాత్రం.. ఒంటరిగా ఉండొద్దు. ఫ్రెండ్స్తో గడపండి.. హెవీ సౌండ్తో మ్యూజిక్ వినండి. వర్కవుట్ చేయండి. ఇకపోతే ఎలోన్నెస్ దీనికి పూర్తి వ్యతిరేకం. ఏకాంతం కోసం అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోనక్కర్లేదు. నీకున్న రిలేషన్స్, ఫ్రెండ్స్, లవ్, హెట్రెడ్.. ఇలా అన్నీ పక్కనపెట్టి మీతో మీరు కూర్చోవాలి. మన లైఫ్కు కావాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అప్పుడే తీసుకుందాం. మీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి. రూమ్ తలుపేసేయండి. నిలువెత్తు అద్దం ముందు నిలుచోండి. ఆ అద్దంలో కనిపించే వ్యక్తిని సాంతం చూడండి. వాడి మీద మీకు చిరాకొస్తోందా? లేక ముద్దొస్తున్నాడా? మీకే అర్థమవుతుంది.
ఏది పడితే అది తినేయకుండా... కసరత్తులు చేస్తే బాగుండు అనిపిస్తే.. వాడికి చెప్పండి. ఆ తర్వాత వాడితో కూర్చుని.. కళ్లలో కళ్లు పెట్టి కాసేపు వాణ్నే చూస్తూ ఉండండి. ఇప్పటివరకు ఏం చేశావు అని అద్దంలో కనిపించేవాణ్ని అడగండి. వాడేం సమాధానం చెబుతాడో జాగ్రత్తగా వినండి. కన్విన్సింగ్గా లేకపోతే ఒప్పుకోవద్దు. మీకున్న అన్ని అనుమానాలు వాణ్ని అడగండి. వాడి విజన్ ఏంటి.. తర్వాతి పదేళ్ల కోసం వాడి దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయో అడగండి. లేవు అంటే ఊరుకోవద్దు. పోనీ తర్వాతి ఒక సంవత్సరం కోసం ప్లాన్ చెబుతాడేమో చూడండి. బిక్క మొహం వేస్తే అసలు సమస్య ఏంటో అడగండి. ఆ సమస్యల్ని అధిగమించడానికి వాడి బుర్ర పని చేయబోయే మీరే మంచి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మీతో కలసి వచ్చింది వాడే. పోయేటప్పుడు కూడా వాడే కంపెనీ. వాణ్ని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎలాంటోడైనా మనకు తప్పదు కదా. వారానికొకసారి అయినా వాడితో కూర్చోండి. ఇద్దరూ కలసి మంచి మ్యూజిక్ వినండి. అప్పుడప్పుడు అద్దంలో ఉన్న వాడితో గడపండి.. వాణ్ని ప్రేమించండి. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఇది చేయాలి. అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లోన్లీనెస్ భయంకరమైనది. ఎలోన్నెస్ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది’’
- పూరి జగన్నాథ్ @ మ్యూజింగ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం