AP News: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన దర్శకుడు రాజమౌళి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన వీరిద్దరూ పల...

Updated : 14 Mar 2022 16:56 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన వీరిద్దరూ సినిమా టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షో ఇతర అంశాలపై చర్చలు జరిపారు. మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవుతున్న దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని