Sriya Reddy: పవన్‌కల్యాణ్‌ గురించి ఆ విషయం నాకు తెలియదు: శ్రియారెడ్డి

‘ఓజీ’ (OG)లో నటించడంపై శ్రియారెడ్డి (Sriya Reddy) స్పందించారు. పవన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Published : 24 Dec 2023 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సలార్‌’ (Salaar)తో సూపర్‌హిట్‌ అందుకున్నారు నటి శ్రియారెడ్డి (Sriya Reddy). ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘రాధారమ’ పాత్ర గురించే ప్రస్తుతం సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ‘ఓజీ’ (OG)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

‘‘ఓజీ’ అద్భుతమైన చిత్రం. సుజిత్ అదిరిపోయే కథ రాశారు. పవన్‌కల్యాణ్‌ను కలిసే వరకూ ఆయన అంత పెద్ద స్టార్‌ అనే విషయం నాకు తెలియదు. ఆయన స్టార్‌డమ్‌ను నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత ఎక్కడికి వెళ్లినా.. ‘మీరు మా దేవుడితో వర్క్‌ చేస్తున్నారు కదా’ అని చాలామంది నన్ను అడిగారు. ఆయనకు విశేష ప్రజాదరణ ఉంది. సెట్‌లో కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మనసు చాలా మంచిది. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఇందులో నాది నెగెటివ్‌ రోల్‌ కాదు. కానీ, నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. అభిమానులతో కలిసి ఫస్ట్‌డే తొలి షో చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని ఆమె తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓజీని నిర్మిస్తున్నారు. ముంబయి, జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Social Look: ఊర్వశీ డ్యాన్స్‌.. ప్రియాంక-నిక్ పార్టీ

‘సలార్‌’ విషయానికి వస్తే.. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన రాధారమ పాత్రను పోషించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రియారెడ్డి తెలిపారు. ఈ పాత్ర తనకు ఎన్నో సవాళ్లు విసిరిందన్నారు. ‘సలార్‌’ విజయం తర్వాత తనకు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని.. అయితే, ఒక నటిగా తనకు వైవిధ్యభరితమైన పాత్రల్లోనే నటించాలని ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని