Mahanatulu: నవ్వులు పంచే ‘మహానటులు’
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, వీజే మ్యాడీ, పవన్ రమేష్, భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహానటులు’. అశోక్ కుమార్ దర్శకుడు. అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, వీజే మ్యాడీ, పవన్ రమేష్, భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహానటులు’. అశోక్ కుమార్ దర్శకుడు. అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, బిగ్బాస్ విజేత సన్నీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘టైటిల్కు తగ్గట్లుగానే సినిమాలో అంతా మహానటులే. పూర్తి వినోదాత్మక కథతో రూపొందుతోంది. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ ఈ కథలో ఉంటారు. వాళ్లు మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్తో ఎలా పైకి ఎదిగారన్నది చిత్ర కథ’’ అన్నారు. ‘‘సినిమా చాలా వినోదభరితంగా ఉంటుంది. నేనిందులో ఓ మంచి పాత్ర చేశా’’ అన్నారు నటుడు వీజే మ్యాడీ. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చేలా ఉంటుంది. మేము త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ తీయనున్నాం’’ అన్నారు. ‘‘మంచి సినిమా ఇది. నాలాంటి కొత్త వాళ్లకు అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అంది నాయిక గోల్డీ నిస్సీ. ఈ చిత్రానికి సంగీతం, కథ, మాటలు: పి.సుధీర్ వర్మ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..