RRR: నెట్టింట చరణ్, ఎన్టీఆర్ల రికార్డు చూడు.. ‘నాటు నాటు వీర నాటు’
‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు నాటు వీర నాటు’ అంటూ రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) యావత్ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) యావత్ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. సంక్రాంతి పండగ వాతావరణాన్ని రెండు నెలల ముందుగానే తీసుకొచ్చారు. కేవలం లిరికల్ వీడియోతోనే రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 10న ‘ఆర్ఆర్ఆర్ మాస్ ఆంథమ్’ (RRR Mass Anthem) పేరుతో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటను విడుదల చేశారు. ఈ హుషారైన గీతం విడుదలైన అనతి కాలంలోనే (సుమారు 48 గంటలు) 20 మిలియన్ల (2 కోట్లు) వీక్షణలు (అన్ని భాషల్లో కలిపి) సొంతం చేసుకుని యూట్యూబ్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం తెలుగు పాటకే ఇప్పటి వరకు సుమారు కోటికిపైగా వ్యూస్ దక్కాయి. చంద్రబోస్ రచించిన ఈ గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.
0.5x లోనూ వేగమే..
సగటు ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల వరకూ అంతా చరణ్, తారక్ డ్యాన్స్ వేగానికి ఫిదా అయిపోయారు. యూట్యూబ్ ఇండియా (Youtube India) సైతం ఈ ఇద్దరి హీరోల డ్యాన్స్ వేగం గురించి తన అభిప్రాయం తెలియజేసింది. ‘నిజం చెప్పాలంటే.. చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ను 0.5x స్పీడ్తో చూసినా ఫాస్ట్గానే కనిపిస్తుంది’ అని ట్వీట్ చేసింది. దీనిపై ‘ఆర్ఆర్ఆర్’ స్పందించింది. ‘మేం 2x స్పీడ్తో ఎడిట్ చేద్దామనుకున్నాం. కానీ.. మా డ్యాన్సింగ్ డైనమైట్స్ (తారక్, చరణ్) ఇద్దరూ ఆ అవసరం లేకుండా అదే లైటెనింగ్ స్పీడ్తో డ్యాన్స్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు’ అని బదులిచ్చింది. వెండితెరపై ఈ జాతరను చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్