ఇంగ్లాండ్‌లో ఘనంగా ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలు..

ఆది గురు శంకరాచార్య జయంతి ఉత్సవాలు ఇంగ్లాండ్‌లో ఘనంగా నిర్వహించారు.

Updated : 08 May 2022 11:17 IST

ఆది గురు శంకరాచార్య జయంతి ఉత్సవాలు ఇంగ్లాండ్‌లో ఘనంగా నిర్వహించారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌లోని ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వంద మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. స్థానికంగా ఉండే హిందూ కమ్యూనిటీకి చెందిన వారే కాకుండా.. ఛెస్టర్‌, క్రీవ్‌ స్టాఫ్టోర్డ్‌, మాంచెస్టర్‌, డెర్బీ, షెఫీల్డ్‌, డాన్‌కస్టర్‌ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని