మోదీజీ ‘నమస్తే ట్రంప్’ మళ్లీ ఎప్పుడు?
తన ప్రియ నేస్తమైన ట్రంప్ గౌరవార్ధం మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు?
భారత్పై ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో చిదంబరం చురకలు
ఇంటర్నెట్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం నరేంద్ర మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని చిదంబరం ప్రశ్నించారు. కొవిడ్-19కి సంబంధించి భారత్ గణాంకాల విశ్వసనీయతపై అమెరికా అధ్యక్షుడు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చిదంబరం వ్యంగ్యంగా స్పందించారు. భారత్, రష్యా, చైనా వంటి దేశాలు కరోనా వైరస్ మరణాల సంఖ్యలను బయట పెట్టవని మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి చర్చలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
‘‘మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ భారత్ను చైనా, రష్యా వంటి దేశాలతో కలిపారు. ఈ మూడు దేశాలు కొవిడ్ మరణాల సంఖ్యను దాచిపెడతాయని ఆరోపించారు. అంతేకాకుండా ఆయా దేశాలే అత్యధిక వాయు కాలుష్యానికి కారణమని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తన ప్రియ నేస్తమైన ట్రంప్ గౌరవార్థం మోదీ మరో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు?’’ అని చిదంబరం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక