ఇంకెన్ని త్యాగాలు చేయాలి?
హిందీయేతర భాషల వారు ఇంకెన్ని త్యాగాలు చేయాలని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవేదన వ్యక్తం చేసిన కుమారస్వామి
ఇంటర్నెట్ డెస్క్: హిందీ అర్థం కానివారిని కార్యక్రమం వదిలి వెళ్లాల్సిందిగా ఓ ఉన్నతాధికారి ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయుష్ శాఖ ఇటీవల నిర్వహించిన ఓ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఇది హిందీని బలవంతంగా రుద్దాలనే ఆర్ధరహితమైన చర్య అని.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తీవ్రంగా ఖండించారు.
‘‘ఈ చర్య ఇంగ్లిష్ తెలియనందుకు విజ్ఞప్తా లేదా హిందీని తప్పనిసరి చేసే సిగ్గుమాలిన ఉత్సాహమా?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సమాఖ్యవాదం దేశ ఐక్యతకు తారకమంత్రమని.. దీనిలో ప్రతి భాషా సమాన భాగస్వామ్యం కలిగిఉందన్నారు. కాగా, హిందీ తెలియనందుకు శిక్షణను వదిలిపొమ్మనటం.. సమాఖ్య భావనకు, రాజ్యాంగానికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. హిందీ తెలియనందుకు కన్నడిగులతో సహా హిందీయేతర భాషల వారు ఇంకెన్ని త్యాగాలు చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దక్షణ భారతదేశానికి చెందిన పలువురు గొప్ప నాయకులు ప్రధాని పదవిని అధిష్టించకుండా హిందీ రాజకీయాలు అడ్డుకున్నాయని కుమారస్వామి గతంలో ఆక్రోశం వెళ్లబుచ్చారు. ప్రభుత్వోద్యోగాల అర్హత పరీక్షలు ఇప్పటికీ హిందీ లేదా ఇంగ్లిష్లలో మాత్రమే నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగా, హిందీలో మాట్లాడనందుకు తమిళనాడుకు చెందిన ఎంపీ కనిమొళికి కూడా ఇటీవల చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురుకావటం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!