గీతం వర్సిటీపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

యూజీసీ నిబంధనలను విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం అతిక్రమించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ

Published : 30 Oct 2020 01:24 IST

అమరావతి: యూజీసీ నిబంధనలను విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం అతిక్రమించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి, యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖ రాశారు. గీతం యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదాను ఉపసంహరించాలని.. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను గీతం వర్సిటీ ఆక్రమించిందని, ఈ వ్యవహారంపై విశాఖ ఆర్డీవో విచారణ జరిపారని తెలపారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా ఆ వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని